ఎంపీ అర్వింద్‌కు లోక్‌సభ స్పీకర్‌ ఫోన్‌

లోక్‌సభ స్పీకర్‌ ఓంప్రకాశ్‌ బిర్లా శుక్రవారం తనకు ఫోన్‌ చేశరాని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఆర్మూర్‌ మండలం ఇస్సాపల్లి వద్ద జరిగిన

Published : 29 Jan 2022 04:08 IST

ఈనాడు, నిజామాబాద్‌: లోక్‌సభ స్పీకర్‌ ఓంప్రకాశ్‌ బిర్లా శుక్రవారం తనకు ఫోన్‌ చేశరాని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఆర్మూర్‌ మండలం ఇస్సాపల్లి వద్ద జరిగిన రాళ్లదాడి ఘటన గురించి ఆరా తీశారన్నారు. పోలీసులు తనతో వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా సభాపతికి వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే పోలీసుల సహకారంతో తనపై దాడి చేయించిందన్నారు. వెంటనే దిల్లీ రావాలని స్పీకర్‌ సూచించారని, రెండ్రోజుల్లో వెళ్లి ఫిర్యాదు చేస్తానని ఎంపీ అర్వింద్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని