పూర్వాంచల్లో పట్టం ఎవరికో!
ఉత్తర్ప్రదేశ్లో పశ్చిమాన మొదలైన పోలింగ్ ప్రక్రియ.. ఒక్కో విడత ముగిసేకొద్దీ తూర్పు దిశగా సాగుతోంది. మధ్య యూపీలోని మెజార్టీ నియోజకవర్గాలకు నాలుగో దశలో ఎన్నికలు ముగియగా..
ఉత్తర్ప్రదేశ్లో పశ్చిమాన మొదలైన పోలింగ్ ప్రక్రియ.. ఒక్కో విడత ముగిసేకొద్దీ తూర్పు దిశగా సాగుతోంది. మధ్య యూపీలోని మెజార్టీ నియోజకవర్గాలకు నాలుగో దశలో ఎన్నికలు ముగియగా.. ఐదో దశతో పూర్వాంచల్ (తూర్పు యూపీ)లో పోరు ప్రారంభం కానుంది. అవధ్, పూర్వాంచల్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 12 జిల్లాల్లోని 61 నియోజకవర్గాలకు ఐదో విడతలో పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల తరహాలో ఈ దశలోని సీట్లలో మరోసారి సత్తా చాటాలని అధికార భాజపా తహతహలాడుతుండగా.. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకొని ఆ పార్టీపై పైచేయి సాధించాలన్న ప్రణాళికలతో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ముందుకెళ్తోంది. ప్రస్తుతమిక్కడ ఆయా పార్టీల పరిస్థితి ఎలా ఉందన్నది పరిశీలిస్తే..
భాజపా: అయోధ్య రాముడిపై ఆశలు
పూర్వాంచల్ రాజకీయాల్లో ‘అయోధ్య రామమందిరం’ చాలా ముఖ్యమైన అంశం. యూపీలో 1990ల్లో భాజపా అధికారంలోకి రావడంలో అది అత్యంత కీలక పాత్ర పోషించింది. మందిర నిర్మాణం గత ఏడాది ప్రారంభమవడం కమలదళానికి సానుకూలాంశం. అందుకే ఒకప్పటి స్థాయిలో కాకున్నా.. ఇప్పటికీ ప్రచారంలో రామమందిర అంశాన్ని కమలనాథులు ప్రస్తావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తొలి మూడు విడతల్లో భాజపా వెనుకబడిందని విశ్లేషణలు వస్తున్నాయి. అవధ్, పూర్వాంచల్ ప్రాంతాల్లో ఆధిపత్యం ప్రదర్శించడం ద్వారా ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలని కమలనాథులు చూస్తున్నారు. అయితే పోషణ భారమై ప్రజలు వదిలేస్తున్న గోవులు, ఇతర పశువులు ప్రస్తుత ఎన్నికల్లో ఇక్కడ పార్టీకి ప్రతికూలంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్రమత్తమైన ప్రధాని మోదీ.. ఆ సమస్యను అధిగమించేందుకు కొత్త పథకాన్ని తీసుకొస్తామని ఇటీవల బహ్రాయిచ్లో నిర్వహించిన ర్యాలీలో ప్రకటించారు. వట్టిపోయిన గోవుల పోషణ బాధ్యతలు చూసుకువారికి ఆర్థిక సహాయం చేస్తామని సీఎం యోగి చెప్పారు.
ఎస్పీ: ప్రభుత్వంపై వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని..
అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ.. ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతపైనే ఈ దశలో ఎక్కువగా ఆధారపడినట్లు కనిపిస్తోంది. కీలకమైన అయోధ్య మందిరం అంశం గురించి గతంలో ఆ పార్టీ నేతలు ఇక్కడ ప్రచారంలో విస్తృతంగా మాట్లాడేవారు. తద్వారా మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించేవారు. ఇప్పుడు ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అఖిలేశ్.. వ్యూహాత్మకంగా ఆ అంశాన్ని ర్యాలీల్లో ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఓం ప్రకాశ్ రాజ్భర్ నాయకత్వంలోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) తమ మిత్రపక్షంగా ఉండటం ఈ ప్రాంతంలో అఖిలేశ్ పార్టీకి కలిసొచ్చే అంశం.తాము అధికారంలోకి వస్తే.. పశువుల నుంచి పంటలను రక్షించుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ఆయన ప్రకటించారు. ఐదో విడతలో పోలింగ్ జరగనున్న స్థానాల్లో 2012 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ మంచి ఫలితాలు రాబట్టింది. మొత్తం 61 సీట్లకుగాను 39 చోట్ల విజయ పతాకం ఎగరేసింది.
బీఎస్పీ: తాను గెలవకపోయినా..!
పూర్వాంచల్లో బీఎస్పీకి చెప్పుకోదగ్గ ఓటుబ్యాంకు ఉంది. తాను గెలవలేకపోయినా.. చాలా స్థానాల్లో ఇతర పార్టీల విజయావకాశాలను దెబ్బతీయగల బలం ఆ పార్టీ సొంతం. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బ్రాహ్మణ ఓటర్లు బీఎస్పీ వైపు మొగ్గారు. 2012 ఎన్నికల నుంచి మాత్రం వారు భాజపాకు అండగా నిలుస్తున్నారు. బ్రాహ్మణులతోపాటు జాతవ్, జాతవేతర దళితులను తిరిగి తమవైపు తిప్పుకొనేందుకు బీఎస్పీ ఈ దఫా పక్కా వ్యూహాలతో ముందుకెళ్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎస్పీ మైనారిటీ అభ్యర్థులను బరిలో దించిన పలు స్థానాల్లో.. బీఎస్పీ కూడా అదే సామాజికవర్గానికి చెందిన బలమైన అభ్యర్థులకు టికెట్ కేటాయించింది.
- ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?