అధిష్ఠానం నిర్ణయాలపైనే పార్టీలో నా భవితవ్యం
కాంగ్రెస్లో తాను కొనసాగేది.. లేనిది.. పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లా జగదేవపూర్లో డీసీసీ అధ్యక్షుడు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
జగదేవపూర్, న్యూస్టుడే: కాంగ్రెస్లో తాను కొనసాగేది.. లేనిది.. పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లా జగదేవపూర్లో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ను గద్దె దించేవరకు పోరాడతానని అన్నారు. అప్పటివరకు తాను రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఉద్యమాలు, ఆత్మబలిదానాలతో సాధించుకున్న రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో పోరాటాలు చేశారన్నారు. శాసనసభ్యులు పార్టీ మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధిష్ఠానానిదే అని అన్నారు. పదవుల కోసం పార్టీ మారే ఆలోచన తనకు లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో భాజపాలో చేరుతున్నట్లు ప్రసార మాధ్యమాల్లో ఊహాగానాలు వస్తున్నాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్