Rahul Gandhi: ‘గుర్రాల రేసులో గాడిద..!’ కేంద్ర మంత్రి పురీ వ్యంగ్యాస్త్రాలు
రాహుల్ గాంధీపై వేటు విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ సూచించారు. ‘నేను సావర్కర్ను కాదు’ అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. గుర్రాల రేసులో గాడిదను తీసుకొస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
దిల్లీ: కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటు విషయంలో ప్రతిపక్షాలు సోమవారం పార్లమెంటు (Parliament)లో పెద్దఎత్తున నిరసన తెలిపాయి. విపక్ష నేతలు నల్లదుస్తుల్లో ర్యాలీ తీశారు. అయితే, ఈ పరిణామాలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ (Hardeep Singh Puri) ఖండించారు. న్యాయ వ్యవస్థ పనితీరుతోపాటు తమ రాజకీయ ప్రసంగాలు, వాటిని సమర్థించుకునే విషయంలో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘నేను సావర్కర్ను కాదు. క్షమాపణలు చెప్పను’ అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. సావర్కర్ వంటి వ్యక్తుల పోరాటం గురించి తెలుసా? అని కేంద్ర మంత్రి పురీ ప్రశ్నించారు. గుర్రాల రేసులో గాడిదను తీసుకొస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మహాభారతం, సావర్కర్లను ఉటంకించడాన్ని గుర్తుచేస్తూ.. అసలేం జరుగుతోందన్నారు. ‘రాహుల్ గాంధీని కోర్టు దోషిగా తేల్చింది. తదనంతరం అనర్హత విషయంలో వాటికవే జరిగే ప్రక్రియలు ఉన్నాయి. ఈ విషయంపై కోర్టులో పోరాడాలి. కాంగ్రెస్ విషయంలో దేశ ప్రజలే తీర్పు ఇస్తారు’ అని పురీ అన్నారు.
మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఇటీవల రాహుల్కు రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అనంతరం లోక్సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్తోపాటు ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతున్నాయి. భాజపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి