Gujarat: భాజపా ‘నో రిపీట్’ ఫార్ములా.. గుజరాత్లో ‘కొత్త’ కేబినెట్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంతరాష్ట్రమైన గుజరాత్లో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. మూడు రోజుల క్రితం నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ బాధ్యతలు
కొలువుదీరిన భూపేంద్రపటేల్ మంత్రివర్గం
గాంధీనగర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంతరాష్ట్రమైన గుజరాత్లో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. మూడు రోజుల క్రితం నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ బాధ్యతలు చేపట్టగా.. గురువారం మంత్రుల ప్రమాణస్వీకారం జరిగింది. గాంధీనగర్లోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 24 మంది శాసనసభ్యులతో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణం చేయించారు. వీరిలో 10 మంది కేబినెట్ మంత్రులు కాగా.. 14 మంది సహాయ/స్వతంత్ర మంత్రులు.
గుజరాత్లో వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భాజపా ‘నో రిపీట్’ విధానాన్ని అవలంభించింది. అందుకు అనుగుణంగానే నూతన మంత్రివర్గంలోకి అంతా కొత్తవారికే అవకాశమిచ్చింది. గతంలో విజయ్ రూపాణీ కేబినెట్లో పనిచేసిన ఎవరికీ కూడా తాజా మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం గమనార్హం. అసెంబ్లీ స్పీకర్ రాజేంద్రత్రివేదిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రమాణస్వీకారానికి కొద్ది గంటల ముందు రాజేంద్రత్రివేది తన సభాపతి పదవికి రాజీనామా చేశారు.
ఇక, నేడు ప్రమాణస్వీకారం చేసిన వారిలో 21 మంది తొలిసారిగా మంత్రులు కావడం విశేషం. అటు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన భూపేంద్ర పటేల్ కూడా తొలిసారి ఎమ్మెల్యేనే. ఒక్క రాజేంద్ర త్రివేది, రాఘవ్జీ పటేల్, కిరీట్సిన్హ్ రాణాకు గతంలో మంత్రి పదవి చేపట్టిన అనుభవం ఉంది.
విజయ్ రూపాణీ రాజీనామాతో గుజరాత్ రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ పరిణామాలు అనేక ఊహాగానాలకు తెరలేపాయి. పటేల్ వర్గీయుల మద్దతు కోసమే భాజపా అధిష్ఠానం సీఎం మార్పు చేపట్టినట్లు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్(పాటిదార్ వర్గీయుడు)కు రాష్ట్ర పగ్గాలు అప్పగించడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది. మరోవైపు కొత్త మంత్రివర్గంలోనూ పటేల్ వర్గీయులకు అధిక ప్రాధాన్యం కల్పించడం గమనార్హం. నూతన మంత్రివర్గంలో ఆరుగురు పటేల్ వర్గీయులకు చోటు కల్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?