Gujarat Polls: జామ్నగర్లో జడేజాల పోరు.. భార్య తరఫున రవీంద్ర.. పార్టీ కోసం సోదరి
గుజరాత్ ఎన్నికల్లో భాగంగా జామ్నగర్ అసెంబ్లీ స్థానంలో ఆసక్తికర ప్రచారం కొనసాగుతోంది. ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా ఆయన సతీమణి తరఫున ప్రచారం నిర్వహిస్తుండగా.. జడేజా సోదరి మాత్రం కాంగ్రెస్ తరఫున ముమ్మరం ప్రచారం చేస్తూ సొంత వదినపైనే విమర్శలు గుప్పిస్తున్నారు.
జామ్నగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో.. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వేర్వేరు పార్టీల తరఫున ప్రచారాల్లో మునిగిపోయి.. ఒకరిపై ఒకరు విమర్శలు, ఫిర్యాదులు చేసుకుంటున్న ఘటనలు కనిపిస్తున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja), ఆయన సోదరి చేరిపోయారు. భార్య తరఫున (BJP) రవీంద్ర జడేజా రోడ్డు షోలు నిర్వహిస్తుండగా.. ఆయన సోదరి (Naynaba Jadeja) మాత్రం కాంగ్రెస్ తరఫున విస్తృత ప్రచారం చేపడుతూ సొంత వదినపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా తోబుట్టువుల ప్రచారంతో జామ్నగర్ నార్త్ పోరు ఆసక్తికరంగా సాగుతోంది.
రవీంద్ర జడేజా భార్య రవాబా జడేజాను జామ్నగర్ నార్త్ స్థానం నుంచి భాజపా ఎన్నికల బరిలో దించింది. ఆయన సోదరి నయ్నబా కాంగ్రెస్ పార్టీ తరఫున వేరే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే, జడేజా సతీమణికి భాజపా టికెట్ కేటాయించిన వెంటనే నయ్నబాను స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చేర్చిన కాంగ్రెస్.. జామ్నగర్లో ప్రచారానికి పంపింది. దీంతో కాంగ్రెస్ నేత బిపేంద్రసిన్హ్ జడేజాకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ.. సొంత వదినపైనే ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగానికి భాజపా విధానాలే కారణమంటూ మండిపడుతున్నారు.
2017 ఎన్నికల్లో జామ్నగర్ నార్త్లో భాజపా సీనియర్ నేత ధర్మేంద్రసిన్హ్ జడేజా భారీ మెజారిటీతో గెలుపొందారు. అయినప్పటికీ ఈసారి ఆయనకు కాకుండా రివాబాకు భాజపా సీటు కేటాయించింది. ధర్మేంద్రసిన్హ్కు పార్టీలో వేరే బాధ్యతలు అప్పగించింది. ఇలా జామ్నగర్ నార్త్లో బరిలో ఉన్న ఇద్దరు నేతలు రాజ్పుత్ వర్గానికి చెందిన వారే అయినప్పటికీ.. ఆ ప్రాంతంలో ముస్లిం ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. రివాబా గెలుపుపై భాజపా కార్యకర్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ స్థానంలో స్వల్ప తేడాతోనే గెలుపోటములు తేలుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. -
ఈసారి మీకు ఓట్లు వెయ్యం
‘ఉదయగిరి వెళ్లే రోడ్డు చూశారా.. ఎంత అధ్వానంగా ఉంది.. ఒక్కసారైనా బాగు చేయాలనిపించలేదా.. మా ఇబ్బందులను పట్టించుకోని మీకు ఈ ఎన్నికల్లో ఓట్లు వెయ్యం’ అని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పోలిరెడ్డిపల్లి గ్రామస్థులు. -
పేదల బియ్యం దోచుకున్న జగన్
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంచాల్సిన బియ్యాన్నీ సీఎం జగన్ దోచుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఆయన తండ్రి, -
రోజంతా శిబిరంలోనే జగన్.. కొద్దిమంది నేతలతో సమావేశం
బస్సు యాత్ర నుంచి సీఎం జగన్ సోమవారం విరామం తీసుకున్నారు. ఆదివారం రాత్రి విశాఖలోని ఎండాడ కూడలిలో యాత్ర ముగించుకుని మధురవాడ ఐటీహిల్స్ సమీపంలో బస చేసేందుకు శిబిరానికి చేరుకున్నారు. -
నిర్మించడం చేతకాని ప్రభుత్వానికి కూల్చే అధికారం ఎక్కడిది?: చంద్రబాబు
పేదల ఇళ్లను నిర్మించి ఇవ్వడం చేతకాని వైకాపా ప్రభుత్వానికి కూల్చే అధికారం ఎక్కడిదని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.