Nitish kumar: 4 కేంద్రమంత్రి పదవులు అడిగితే.. భాజపా అప్పుడు ఒప్పుకోలేదు: నీతీశ్
బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యు) అధినేత నీతీశ్ కుమార్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో నాలుగు కేంద్రమంత్రి పదవులు ఇవ్వాలన్న.....
పట్నా: ఇటీవల భాజపాతో తెగదెంపులు చేసుకొని మహాకూటమితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యు) అధినేత నీతీశ్ కుమార్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో నాలుగు కేంద్రమంత్రి పదవులు ఇవ్వాలన్న తన డిమాండ్ను భాజపా తిరస్కరించినప్పుడే ఇక తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరకూడదని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. తన మాజీ సన్నిహితుడు ఆర్సీపీ సింగ్ గతేడాది కేంద్రమంత్రివర్గంలో చేరడంలోనూ తన అంగీకారం లేదని నీతీశ్ స్పష్టంచేశారు.
‘‘మాకు 16మంది ఎంపీలు ఉన్నారు.. కనీసం నాలుగు కేంద్రమంత్రి పదవులు కావాలని 2019లోనే భాజపాను అడిగా. బిహార్ నుంచి మరొకరికి మాత్రమే ఇవ్వగలమని చెప్పారు. ఐదుగురికి ఇవ్వాల్సిన చోట అంతకన్నా తక్కువ మందికి ఇవ్వడానికి అంగీకరిస్తే చెడు సందేశం వెళ్తుంది. వాళ్లు ఐదుగురికి ఇచ్చేందుకు తిరస్కరించడంతో మేం కేంద్ర మంత్రివర్గంలో చేరలేదు’’ అని నీతీశ్ వ్యాఖ్యానించారు. అలాగే, ఆర్సీపీ సింగ్ కేంద్రమంత్రివర్గంలో చేరడానికి ముందే నీతీశ్ సమ్మతి కోరినట్టుగా భాజపా నేతలు చేస్తున్న వ్యాఖ్యల్నీ ఆయన ఖండించారు. అవన్నీ అబద్ధాలేనన్నారు.
ఇటీవల నీతీశ్ కుమార్ ఎన్డీయేతో తెగదెంపులు చేసుకోవడంతో బిహార్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. భాజపా-జేడీ(యు) సంకీర్ణ ప్రభుత్వంలో సీఎంగా కొనసాగిన నీతీశ్.. తన పదవికి రాజీనామా చేసి ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్షాల సారథ్యంలోని మహాకూటమితో చేతుల కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మొన్న నీతీశ్ ఎనిమిదోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ రెండోసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. దీంతో నీతీశ్పై భాజపా నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం