అవకాశవాదులకు స్థానం లేదు: హరీశ్రావు
కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో చేయని పనులు ఏడేళ్లలో తెరాస చేసి చూపించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ...
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో చేయని పనులు ఏడేళ్లలో తెరాస చేసి చూపించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. త్వరలోనే 50వేల ఉద్యోగాల భర్తీని చేపడతామని.. 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు ఇస్తామని చెప్పారు. స్థలం ఉన్నవారు ఇళ్లు కట్టుకునేందుకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తామన్నారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి తెలంగాణను అవమానించారని.. తెలంగాణ గురించి మాట్లాడితే అసెంబ్లీ నుంచి బయటకు పంపారని హరీశ్రావు గుర్తు చేశారు. ఇప్పుడు వైఎస్ వారసులమని చెప్పుకుంటూ కొంత మంది రాష్ట్రానికి వస్తున్నారని వ్యాఖ్యానించారు. అలాంటి అవకాశవాదులకు తెలంగాణలో స్థానం లేదని తేల్చి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.