అవకాశవాదులకు స్థానం లేదు: హరీశ్‌రావు

కాంగ్రెస్‌ పార్టీ 70 ఏళ్లలో చేయని పనులు ఏడేళ్లలో తెరాస చేసి చూపించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌, ట్యాంకర్‌ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ...

Updated : 24 Sep 2022 17:16 IST

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ 70 ఏళ్లలో చేయని పనులు ఏడేళ్లలో తెరాస చేసి చూపించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌, ట్యాంకర్‌ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. త్వరలోనే 50వేల ఉద్యోగాల భర్తీని చేపడతామని.. 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు ఇస్తామని చెప్పారు. స్థలం ఉన్నవారు ఇళ్లు కట్టుకునేందుకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తామన్నారు. గతంలో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణను అవమానించారని.. తెలంగాణ గురించి మాట్లాడితే అసెంబ్లీ నుంచి బయటకు పంపారని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఇప్పుడు వైఎస్‌ వారసులమని చెప్పుకుంటూ కొంత మంది రాష్ట్రానికి వస్తున్నారని వ్యాఖ్యానించారు. అలాంటి అవకాశవాదులకు తెలంగాణలో స్థానం లేదని తేల్చి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని