Bandi Sanjay: సీఎం కేసీఆర్‌ను కించపరుస్తూ స్కిట్‌.. బండి సంజయ్‌కి నోటీసులు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కించపరిచేలా నాటకం ప్రదర్శించారంటూ భాజపా నాయకులు రాణి రుద్రమ, దరువు ఎల్లన్నను హయత్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 14 Jun 2022 14:25 IST

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కించపరిచేలా నాటకం ప్రదర్శించారంటూ భాజపా నాయకులు రాణి రుద్రమ, దరువు ఎల్లన్నను హయత్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భాజపా ఆధ్వర్యంలో నాగోల్‌ బండ్లగూడలో ఏర్పాటు చేసిన ‘అమరుల యాదిలో’ సభలో సీఎం కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా స్కిట్‌ వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి కూడా 41A CRPC కింద నోటీసులు జారీ చేసినట్లు హయత్‌నగర్‌ పోలీసులు తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే ఆ పార్టీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని అరెస్టు చేయగా.. ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని