అది కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం: కుమారస్వామి
నూతన పార్లమెంట్ భవన (New Parliament Building) ప్రారంభోత్సవ కార్యక్రమంపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ (Congress) పార్టీ తన రెండు నాల్కల ధోరణిని మరోసారి బయటపెట్టిందని జేడీఎస్ (JDS) నేత హెచ్డీ కుమారస్వామి అన్నారు.
బెంగళూరు: నూతన పార్లమెంట్ భవనం (New Parliament Building) ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ (Congress) పార్టీ హాజరుకాకపోవడాన్ని జేడీఎస్ (KDS) నేత, కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి (HD Kumaraswamy) తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి తన ద్వంద వైఖరిని ప్రదర్శిస్తోందని విమర్శించారు. కొన్ని వర్గాల వారి ఓట్లతో రాజకీయంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఇలా చేస్తోందని ఆరోపించారు. మే 28న జరిగే నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జేడీఎస్ హాజరవుతుందని ఆ పార్టీ అధినేత హెచ్డీ దేవేగౌడ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కుమారస్వామి తప్పుబట్టారు.
‘‘నూతన పార్లమెంట్ భవనం ఏదో ఒక రాజకీయ పార్టీ నిధులతో నిర్మించింది కాదు. దేశంలో ఉన్న ఎంతోమంది పన్ను చెల్లింపుదారుల కట్టిన పన్ను సొమ్ముతో నిర్మించింది. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ భవనానికి గవర్నర్ కాకుండా సోనియా, రాహుల్ గాంధీ శంకుస్థాపన చేశారు. కర్ణాటక విధానసౌధను 2005లో గవర్నర్ కాకుండా అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ధరమ్సింగ్ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణికి ఇదే నిదర్శనం. ఓట్ల కోసం ఆ పార్టీ స్వార్థపూరిత రాజకీయాలకు పాల్పడుతోంది. కాంగ్రెస్ నిజంగా గిరిజన మహిళను గౌరవించాలనుకుంటే, ఆమెను ఎందుకు ఏకగ్రీవంగా ఎన్నుకోలేదు? కాంగ్రెస్ పార్టీ చౌకబారు రాజకీయాలతో తన ప్రతిష్ఠను దిగజార్చుకోవద్దు’’ అని కుమారస్వామి సూచించారు.
నూతన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడాన్ని.. కాంగ్రెస్, ఆప్, టీఎంసీ సహా 19 విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ఈ మేరకు ఆ పార్టీలు పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకాబోమని ప్రకటించాయి. ఈ నిర్ణయాన్ని భాజపా సహా ఎన్డీయే భాగస్వామ్యపక్ష పార్టీలు తప్పుబట్టాయి. గత కొద్దిరోజులుగా పార్లమెంట్ ప్రారంభోత్సవం, రాజదండం గురించి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ మిత్రపక్షంగా వ్యవహరించిన జేడీఎస్ ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్.. లెక్కపెట్టుకోండి
కాంగ్రెస్ ఎమ్మెల్యేల జోలికి వస్తే సహించేది లేదని.. భారాసలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో కేసీఆర్ ప్రతిరోజూ సాయంత్రం లెక్కపెట్టుకోవాలని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
భారాస, కాంగ్రెస్ రెండూ అవినీతి పార్టీలే
‘తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్వే లాంటిది. ఎంతోమంది ఉద్యమకారుల బలిదానంతో రాష్ట్రం ఏర్పడింది. భారాస.. ప్రజల సొమ్మును లూటీ చేసింది. -
అయిదేళ్ల పాలనలో సర్వం నాశనం
కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ను చూపిస్తూ ‘మీ పాలన ఇదీ’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని చెప్పారు. -
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
విజయవాడ అజిత్సింగ్నగర్లోని తెదేపా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసుల కదలికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. -
కుప్పంలో చంద్రబాబు నామినేషన్
కుప్పం నియోజకవర్గ అభ్యర్థిగా తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన భార్య భువనేశ్వరి శుక్రవారం మధ్యాహ్నం 1.27 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. -
కూటమి పాశుపతాస్త్రం
తెదేపా, భాజపా, జనసేన పార్టీల కూటమి నిప్పుల ఉప్పెన, అగ్నిపర్వత విస్ఫోటం అని.. ఆ పాశుపతాస్త్రాన్ని తట్టుకొనే శక్తి ఎవరికీ లేదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. -
ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి నామినేషన్
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. -
తొలిదశ పోలింగ్ 62.37%
దేశంలో 18వ లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటింగ్ శుక్రవారం పూర్తయింది. -
అధికార దాహం తీరకే శాపనార్థాలు
రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన భారాస నేతలు ఇంకా అధికార దాహం తీరక ఈ ప్రభుత్వం కొనసాగదు, కూలిపోతుందని శాపనార్థాలు పెడుతున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. -
22 నుంచి కేసీఆర్ బస్సుయాత్ర
భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టే బస్సు యాత్రకు అనుమతి కోరుతూ భారాస అధికార ప్రతినిధి కేతిరెడ్డి వాసుదేవరెడ్డి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి (సీఈవో) వికాస్రాజ్కు వినతిపత్రం సమర్పించారు. -
రెండో రోజు 57 నామినేషన్లు
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు రెండో రోజైన శుక్రవారం 57 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రెండు రోజుల్లో కలిపి దాఖలైన నామినేషన్ల సంఖ్య 99కి చేరింది. -
దిల్లీ కాంగ్రెస్.. గల్లీ కాంగ్రెస్ వేర్వేరు
దిల్లీ కాంగ్రెస్, గల్లీ కాంగ్రెస్ వేరువేరని.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భాజపాకు ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
ఎన్నికల తర్వాత రుణమాఫీ అంటే నమ్మేదెవరు?
ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఎకరానికి సగటున 28 క్వింటాళ్ల వడ్లకు రూ.14 వేల బోనస్ ఇవ్వాలని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
భాజపా, కాంగ్రెస్లకు ఓట్లు అడిగే హక్కు లేదు
త లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని భాజపా, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని కాంగ్రెస్లకు ఇప్పుడు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. -
ఎన్నికల నిబంధనల ఉల్లంఘన.. ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యేలపై కేసుల నమోదు
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు ఓ ఎంపీ అభ్యర్థిపై కేసులు నమోదయ్యాయి. -
కలిసి పనిచేయడానికి అంగీకారం
పార్లమెంటు ఎన్నికల్లో సీపీఎం, కాంగ్రెస్ కలిసి పనిచేయాలనే అంగీకారానికి వచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. -
భాజపా ఓటమే సీపీఎం లక్ష్యం: బీవీ రాఘవులు
మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మారుస్తామంటున్న భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. -
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్: కేటీఆర్
అన్నివర్గాల ప్రజలకు, యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కపటనీతికి మారు పేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. -
కాంగ్రెస్లోకి మరో భారాస ఎమ్మెల్యే!
మరో భారాస ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి రాజకీయ పార్టీల మధ్య ఒకవైపు వాదోపవాదాలు జరుగుతుండగా, మరోవైపు రాజేంద్రనగర్ భారాస ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సంక్షిప్త వార్తలు
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక డిమాండ్తో యుగతులసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?