Bjp: భాజపాకు రూ.1000 విరాళంగా ఇచ్చిన ప్రధాని
భాజపా మద్దతుదారులు పార్టీ బలోపేతం కోసం మైక్రో డొనేషన్స్ అందించి సహాయపడాలని ప్రధాని మోదీ కోరారు. పార్టీ కోసం తాను...
దిల్లీ: భాజపా మద్దతుదారులు పార్టీ బలోపేతం కోసం మైక్రో డొనేషన్స్ అందించి సహాయపడాలని ప్రధాని మోదీ కోరారు. పార్టీ కోసం తాను రూ.1000 విరాళంగా ఇచ్చినట్లు, పార్టీ మద్దతుదారులంతా విరాళాలు ఇవ్వాలని కోరుతూ ప్రధాని ట్వీట్ చేశారు. ఎల్లప్పుడూ దేశానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేదే భాజపా విధానమని, దేశ సంస్కృతిని కాపాడుతూ నిస్వార్థంగా జీవితాంతం సేవ చేయడమే భాజపా క్యాడర్ లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం మద్దతు దారులు ఇచ్చే మైక్రోడొనేషన్లు ఎంతగానో ఉపయోగపడతాయని తద్వారా భాజపా బలోపేతమవుతుందని ట్వీట్ చేశారు. డోనేషన్ ఇచ్చిన రసీదును ప్రధాని ట్వీట్కు జతచేశారు. ఇందులో మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, పాన్కార్డు నెంబర్ గోప్యత దృష్ట్యా చూపించలేదు. ఎందుకోసం డొనేషన్ ఇస్తున్నారు అన్న చోట పార్టీ ఫండ్ అని చూపించారు.విరాళం మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా కూడా రూ.1000 విరాళంగా ఇచ్చారు. నమో యాప్లో డొనేషన్ మాడ్యూల్ ద్వారా విరాళం ఇచ్చిన ఆయన భాజపాను బలోపేతం చేయడానికి తన సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ మద్దతుదారులతో పాటు, వారికి ప్రజా జీవితంలోని సన్నిహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులను కూడా రెఫరల్ కోడ్ ఉపయోగించి విరాళాలు అందించడంలో భాగస్వాముల్ని చేయాలని జేపీ నడ్డా ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రారంభించిన మైక్రోడొనేషన్స్ స్వీకరణ దీనదయాళ్ జీ పుణ్యతిథి అయిన ఫిబ్రవరి 11, 2022వరకు కొనసాగుతుందని తెలిపారు.రూ.5నుంచి రూ.1000 వరకు విరాళాలుగా అందించవచ్చని నడ్డా ఒక ప్రకటనలో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా దగ్గర లేదు
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తనవద్ద లేదని, అందుకే భాజపా ఇచ్చిన ఆఫర్ను తిరస్కరించానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
మహావికాస్ అఘాడీలో లుకలుకలు
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) బుధవారం మహారాష్ట్రలోని 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో రగడ రాజుకుంది. -
దిలీప్ ఘోష్, సుప్రియాలకు ఈసీ నోటీసులు
ఎన్నికలవేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్లకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
దిలీప్ ఘోష్, సుప్రియాలకు ఈసీ నోటీసులు
ఎన్నికలవేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్లకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
ఓట్లు చీల్చాలనుకునేవారి చేతులు నరికేయాలి
లోక్సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని ఝాబువా జిల్లాలో ఎవరైనా ఓట్ల చీలిక గురించి మాట్లాడితే వారిని వదిలిపెట్టకుండా చేతులు నరికేయాలని కాంగ్రెస్ శాసనసభ్యుడు వీర్ సింగ్ భూరియా తన అనుచరులను రెచ్చగొట్టేలా పిలుపునిచ్చారు. -
ఎన్నికల్లో కీలకాంశం నిరుద్యోగమే
నిరుద్యోగ సమస్య నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రధాని మోదీ అన్ని విధాల ప్రయత్నిస్తున్నప్పటికీ సార్వత్రిక ఎన్నికల్లో ఈ అంశమే దేశ భవిష్యత్తును నిర్ణయించనుందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. -
అసమర్థ పాలనతోనే కరవు పరిస్థితులు
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అసమర్థ పాలనతోనే రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని కరీంనగర్ లోక్సభ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు. -
రైతులకిచ్చిన హామీలేమయ్యాయి?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు ఏనాడో దాటిపోయిందని.. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదని భారాస నేతలు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. -
భాజపా తెలంగాణ ఎన్నికల ఇన్ఛార్జిగా అభయ్పాటిల్
తెలంగాణ లోక్సభ ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం భాజపా ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే అభయ్పాటిల్ నియమితులయ్యారు. -
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. -
మాజీ మంత్రి చిత్తరంజన్దాస్ కాంగ్రెస్లో చేరిక
మాజీ మంత్రి చిత్తరంజన్దాస్.. నాగర్కర్నూల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. తలకొండపల్లి మండలం సంగాయిపల్లిలో బుధవారం ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి(కల్వకుర్తి), వంశీకృష్ణ (అచ్చంపేట) సమక్షంలో చిత్తరంజన్దాస్కు మల్లు రవి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. -
ఫోన్ ట్యాపింగ్లో ఎర్రబెల్లిదే కీలక పాత్ర
భారాస అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. -
ఫోన్ ట్యాపింగ్పై నిష్పాక్షిక విచారణ చేపట్టాలి
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిష్పాక్షికంగా విచారణ చేపట్టాలని మెదక్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రఘునందన్రావు రాష్ట్ర డీజీపీని కోరారు. -
భారాస ఆరిపోయే దీపం: మధుయాస్కీగౌడ్
భారాస పార్టీ ఆరిపోయే దీపం అని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీగౌడ్ వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు. -
సంక్షిప్త వార్తలు
ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేత, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఇండియా కూటమి ఈ నెల 31న దిల్లీలో నిర్వహించనున్న ‘మహార్యాలీ’ని విజయవంతం చేయడానికి కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేపట్టారు. -
అవినీతి పార్టీలతో పొత్తు అక్కర్లేదు: ఏలేటి మహేశ్వర్రెడ్డి
కాంగ్రెస్, భారాస రెండూ పొత్తు పార్టీలని, గతంలో మంత్రి పదవులు పంచుకున్నాయని నిర్మల్ ఎమ్మెల్యే, భాజపా శానససభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. -
ప్రజల దృష్టి మరల్చేందుకే తెరపైకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల హామీలను వదిలేసిందని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
కరవును రాజకీయం చేస్తున్న భారాస
రాష్ట్రంలో కరవు పరిస్థితులను భారాస రాజకీయం చేసే ప్రయత్నం చేస్తోందని, కరవుకు కాంగ్రెస్ కారణం కాబోదనే విషయాన్ని గ్రహించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎన్ని కుట్రలు చేసినా భాజపా, భారాసలు గెలవలేవు
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలో మరోసారి ఘనవిజయం సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఈ నియోజకవర్గానికి చెందిన భారాస, తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బుధవారం సీఎం నివాసంలో కాంగ్రెస్లో చేరారు. -
4 ఖరారు.. 4 పెండింగ్
రాష్ట్రంలో మరో నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు ముదిరాజ్, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, భువనగిరి నుంచి చామల కిరణ్కుమార్రెడ్డిలకు అవకాశం కల్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా