Munugode Bypolls: చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో ఉద్రిక్తత

మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్‌ మండలం ఆరెగూడెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భాజపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ప్రసంగిస్తుండగా కొందరు దుండగులు రాయి విసిరారు.

Published : 01 Nov 2022 02:03 IST

చౌటుప్పల్‌: ఉపఎన్నిక జరుగుతున్న మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్‌ మండలం ఆరెగూడెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ప్రసంగిస్తుండగా కొందరు దుండగులు రాళ్లు విసిరారు. దీంతో ఇద్దరు భాజపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. నిందితులను పట్టుకోవాలంటూ భాజపా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. అధికార తెరాసకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పోలీసులు వారికి సర్ది చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని