Goa polls: గోవాలో పార్టీలకు ఫిరాయింపుల భయం..నివారణకు ఏం చేస్తున్నాయంటే?
గోవాలో పార్టీలకు ఫిరాయింపుల భయం పట్టుకుంది. గెలిచిన తర్వాత సభ్యులు ఎక్కడ పార్టీ మారతారోనని ముందుగానే జాగ్రత్త పడుతున్నారు.
పనాజీ: వచ్చే నెల గోవాలో అసెంబ్లీ ఎన్నికలు (Goa polls) జరగనున్న నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో పార్టీలకు ఫిరాయింపుల భయం పట్టుకుంది. గెలిచిన తర్వాత సభ్యులు ఎక్కడ పార్టీ మారతారోనని ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ‘అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ADR)’ వివరాల ప్రకారం.. గోవాలో గత ఐదేళ్లలో 24 మంది ఎమ్మెల్యేలు అంటే అక్కడి అసెంబ్లీలో 60 శాతం సామర్థ్యానికి సమానమైన సభ్యులు పార్టీలు మారారు. ఈ నేపథ్యంలోనే పలు పార్టీలు ఫిరాయింపుల నివారణకు చర్యలు తీసుకోవాల్సి వస్తోంది.
కాంగ్రెస్.. దేవుడి ముందు ప్రమాణం..
దేశవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ (Congress)కు ఈ రాష్ట్రంలోనూ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. భాజపా (BJP) అధికారంలో ఉన్న గోవాలో.. గత ఐదేళ్లలో కాంగ్రెస్ నుంచి అనేక మంది ఫిరాయించారు. దీంతో ఈసారి పార్టీ ముందు జాగ్రత్త చర్యలకు దిగింది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల నుంచి పార్టీ మారబోమని ముందుగానే హామీ తీసుకుంటోంది. అందుకోసం పార్టీ అభ్యర్థులతో దేవుడి ముందు ప్రమాణం చేయించింది. ఈ మేరకు మొత్తం 34 మంది అభ్యర్థుల్ని వారి విశ్వాసాల మేరకు దేవాలయం, చర్చి, దర్గాకు తీసుకెళ్లి పార్టీ మారబోమని శనివారం ప్రమాణం చేయించింది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. 40 శాసనసభ స్థానాలున్న గోవాలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లలో గెలుపొంది ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. అలాంటిది ప్రస్తుతం సభలో ఇద్దరు మాత్రమే ఉండడం గమనార్హం. 2019లో అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపాలో చేరారు.
‘‘ప్రజల్లో విశ్వాసం కలిగించేలా అభ్యర్థులందరితో దేవుడి ముందు ప్రమాణం చేయించే కార్యక్రమం చేపట్టాం’’ అని గోవా పీసీసీ అధ్యక్షుడు గిరీశ్ చోడంకర్ తెలిపారు. అందుకోసం పనాజీలోని మహాలక్ష్మీ ఆలయానికి, బాంబోలిమ్లోని చర్చికి, బెటిం గ్రామంలోని దర్గాకు అభ్యర్థులను తీసుకెళ్లామని పేర్కొన్నారు. వీరితో పాటు పార్టీ అధిష్ఠానం తరఫున రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న పి.చిదంబరం సైతం వెళ్లడం గమనార్హం.
ఏడాది ముందే జాగ్రత్త!
అభ్యర్థులతో దేవుడి ముందు ప్రమాణం చేయించడం గోవాలో కొత్తేమీ కాదు. గత ఏడాది జనవరి 31న ‘గోవా ఫార్వర్డ్ పార్టీ (GFP)’ సైతం ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టింది. 2022లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపాకు మద్దతునివ్వబోమని పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఇతర కీలక నాయకులతో ఏడాది ముందే ప్రమాణం చేయించింది. అయినప్పటికీ జీఎఫ్పీకి చెందిన జయేశ్ సల్గోవాంకర్ తర్వాత భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన శాల్గావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున బరిలో ఉన్నారు. 2017లో మనోహర్ పారికర్ నేతృత్వంలో ఏర్పాటైన భాజపా ప్రభుత్వానికి జీఎఫ్పీ మద్దతుగా నిలిచింది. ఫలితంగా ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. కానీ, 2019లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాజపాలో చేరిన తర్వాత జీఎఫ్పీ సభ్యులను సీఎం ప్రమోద్ సావంత్ మంత్రి వర్గం నుంచి తొలగించారు. దీన్ని పరాభవంగా భావించిన జీఎఫ్పీ నేత విజయ్ సర్దేశాయ్.. భాజపాతో చేతులు కలిపేది లేదని ప్రకటించి సభ్యులతో ప్రమాణం చేయించారు.
ఆప్ ఇలా..
మరోవైపు గోవా ఎన్నికల బరిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సైతం ఫిరాయింపులను అరికట్టేందుకు ఇదే తరహా చర్యలు చేపట్టింది. పోటీ చేయనున్న తమ అభ్యర్థులు గెలిచిన తర్వాత పార్టీ మారబోమని ‘లీగల్ అఫిడవిట్’లపై సంతకాలు చేయాల్సి ఉంటుందని ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి కాదా అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి
పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు. -
కాళేశ్వరం, కేసీఆర్పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. -
సంక్షిప్త వార్తలు (7)
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6న జైపుర్లో కాంగ్రెస్ మేనిఫెస్టో
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపుర్లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. -
జగన్పై ఒంటరిగానే నా పోరాటం
‘ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారు. -
ఎమ్మెల్యే కాటసాని సోదరుడు చంద్రశేఖరరెడ్డితో తెదేపా మంతనాలు
నంద్యాల జిల్లా బనగానపల్లిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డితో గురువారం రాత్రి తెదేపా నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి మంతనాలు సాగించారు. -
‘సంగం’పై ఆర్వో ఎలా స్పందిస్తారు: ధూళిపాళ్ల
కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీపై వైకాపా నాయకుడు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారని గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశ్నించారు. -
గుంటూరు మిర్చియార్డులో వైకాపా అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైకాపా గుంటూరు లోక్సభ అభ్యర్థి, పలు శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈ నెల 22న గుంటూరు మిర్చియార్డులో ప్రచారం నిర్వహించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనాకు యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. -
వైకాపా సభ్యత్వానికి తిరుపతి కార్పొరేటర్ల రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. -
వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!
రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
శివసేన (శిందే)లో చేరిన నటుడు గోవిందా
సార్వత్రిక ఎన్నికల ముందు బాలీవుడ్ నటుడు గోవిందా (60) మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గురువారం ఆయన శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీ
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర పార్టీ ‘తెలంగాణ ప్రజల ముంగిట్లోకి జాతీయ మ్యానిఫెస్టో’ కమిటీని ఏర్పాటు చేసింది.