Goa polls: గోవాలో పార్టీలకు ఫిరాయింపుల భయం..నివారణకు ఏం చేస్తున్నాయంటే?
గోవాలో పార్టీలకు ఫిరాయింపుల భయం పట్టుకుంది. గెలిచిన తర్వాత సభ్యులు ఎక్కడ పార్టీ మారతారోనని ముందుగానే జాగ్రత్త పడుతున్నారు.
పనాజీ: వచ్చే నెల గోవాలో అసెంబ్లీ ఎన్నికలు (Goa polls) జరగనున్న నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో పార్టీలకు ఫిరాయింపుల భయం పట్టుకుంది. గెలిచిన తర్వాత సభ్యులు ఎక్కడ పార్టీ మారతారోనని ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ‘అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ADR)’ వివరాల ప్రకారం.. గోవాలో గత ఐదేళ్లలో 24 మంది ఎమ్మెల్యేలు అంటే అక్కడి అసెంబ్లీలో 60 శాతం సామర్థ్యానికి సమానమైన సభ్యులు పార్టీలు మారారు. ఈ నేపథ్యంలోనే పలు పార్టీలు ఫిరాయింపుల నివారణకు చర్యలు తీసుకోవాల్సి వస్తోంది.
కాంగ్రెస్.. దేవుడి ముందు ప్రమాణం..
దేశవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ (Congress)కు ఈ రాష్ట్రంలోనూ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. భాజపా (BJP) అధికారంలో ఉన్న గోవాలో.. గత ఐదేళ్లలో కాంగ్రెస్ నుంచి అనేక మంది ఫిరాయించారు. దీంతో ఈసారి పార్టీ ముందు జాగ్రత్త చర్యలకు దిగింది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల నుంచి పార్టీ మారబోమని ముందుగానే హామీ తీసుకుంటోంది. అందుకోసం పార్టీ అభ్యర్థులతో దేవుడి ముందు ప్రమాణం చేయించింది. ఈ మేరకు మొత్తం 34 మంది అభ్యర్థుల్ని వారి విశ్వాసాల మేరకు దేవాలయం, చర్చి, దర్గాకు తీసుకెళ్లి పార్టీ మారబోమని శనివారం ప్రమాణం చేయించింది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. 40 శాసనసభ స్థానాలున్న గోవాలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లలో గెలుపొంది ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. అలాంటిది ప్రస్తుతం సభలో ఇద్దరు మాత్రమే ఉండడం గమనార్హం. 2019లో అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపాలో చేరారు.
‘‘ప్రజల్లో విశ్వాసం కలిగించేలా అభ్యర్థులందరితో దేవుడి ముందు ప్రమాణం చేయించే కార్యక్రమం చేపట్టాం’’ అని గోవా పీసీసీ అధ్యక్షుడు గిరీశ్ చోడంకర్ తెలిపారు. అందుకోసం పనాజీలోని మహాలక్ష్మీ ఆలయానికి, బాంబోలిమ్లోని చర్చికి, బెటిం గ్రామంలోని దర్గాకు అభ్యర్థులను తీసుకెళ్లామని పేర్కొన్నారు. వీరితో పాటు పార్టీ అధిష్ఠానం తరఫున రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న పి.చిదంబరం సైతం వెళ్లడం గమనార్హం.
ఏడాది ముందే జాగ్రత్త!
అభ్యర్థులతో దేవుడి ముందు ప్రమాణం చేయించడం గోవాలో కొత్తేమీ కాదు. గత ఏడాది జనవరి 31న ‘గోవా ఫార్వర్డ్ పార్టీ (GFP)’ సైతం ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టింది. 2022లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపాకు మద్దతునివ్వబోమని పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఇతర కీలక నాయకులతో ఏడాది ముందే ప్రమాణం చేయించింది. అయినప్పటికీ జీఎఫ్పీకి చెందిన జయేశ్ సల్గోవాంకర్ తర్వాత భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన శాల్గావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున బరిలో ఉన్నారు. 2017లో మనోహర్ పారికర్ నేతృత్వంలో ఏర్పాటైన భాజపా ప్రభుత్వానికి జీఎఫ్పీ మద్దతుగా నిలిచింది. ఫలితంగా ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. కానీ, 2019లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాజపాలో చేరిన తర్వాత జీఎఫ్పీ సభ్యులను సీఎం ప్రమోద్ సావంత్ మంత్రి వర్గం నుంచి తొలగించారు. దీన్ని పరాభవంగా భావించిన జీఎఫ్పీ నేత విజయ్ సర్దేశాయ్.. భాజపాతో చేతులు కలిపేది లేదని ప్రకటించి సభ్యులతో ప్రమాణం చేయించారు.
ఆప్ ఇలా..
మరోవైపు గోవా ఎన్నికల బరిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సైతం ఫిరాయింపులను అరికట్టేందుకు ఇదే తరహా చర్యలు చేపట్టింది. పోటీ చేయనున్న తమ అభ్యర్థులు గెలిచిన తర్వాత పార్టీ మారబోమని ‘లీగల్ అఫిడవిట్’లపై సంతకాలు చేయాల్సి ఉంటుందని ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
NDA: ఎన్డీఏ ‘మహా’ వ్యూహం.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు రంగంలోకి రాజ్..!
మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి వేగంగా పావులు కదుపుతోంది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. -
Sita Soren: జేఎంఎంకు షాక్..! భాజపాలోకి శిబూ సోరెన్ పెద్ద కోడలు
జేఎంఎం అధినేత శిబూ సోరెన్ పెద్ద కోడలు, ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ మంగళవారం భాజపాలో చేరారు. -
AP News: ఈ ఎన్నికల్లో జగన్కు తగిన బుద్ధి చెప్తాం: మందకృష్ణ మాదిగ
ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో మాదిగలకు సంక్షేమం లేకుండా చేసిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. -
Harish Rao: ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలి: హరీశ్రావు
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని భారాస (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) డిమాండ్ చేశారు. -
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే
భాజపా ఇచ్చిన హామీలకు 2004 ఫలితాలే పునరావృతం అవుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. -
YSRCP: చిలకలూరిపేట పంచాయితీ.. మల్లెల రాజేశ్కు సీఎంవో నుంచి పిలుపు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైకాపా (YSRCP) పంచాయితీ తాడేపల్లికి చేరింది. అక్కడి వైకాపా నేత మల్లెల రాజేశ్ నాయుడుకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. -
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
నందికొట్కూరు వైకాపా ఎమ్మెల్యే ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా
Pashupati Paras: కేంద్రమంత్రి పశుపతి కుమార్ పరాస్ తన పదవికి రాజీనామా చేశారు. బిహార్లో చిరాగ్ పాసవాన్కు చెందిన ఎల్జేపీ (రాంవిలాస్)తో భాజపా పొత్తు పెట్టుకోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. -
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
తెదేపా (TDP) ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) కసరత్తు చేస్తున్నారు. -
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు వైకాపా నేతలపై పోలీసులు సోమవారం కేసులు నమోదు చేశారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ
ప్రజలతో మమేకమయ్యేందుకు తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ ఆ పార్టీ అభ్యర్థి లోకేశ్ సోమవారం ‘రచ్చబండ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ప్రధాని సభలో ఇంత భద్రతా వైఫల్యమా?
‘ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్న ప్రజాగళం బహిరంగ సభలో అడుగడుగునా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. సభలో ఎక్కడా ప్రజలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. -
జనం తోసుకుంటుంటే చోద్యం చూశారు
ప్రధాని మోదీ పాల్గొన్న బొప్పూడి ప్రజాగళం సభకు భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ధ్వజమెత్తారు. -
ప్రభుత్వ వెబ్సైట్లలో ఫొటోలు తొలగించాలి
ప్రభుత్వశాఖల వెబ్సైట్లలో ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఉండడంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)కి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. -
ప్రధాని సభకు ఆటంకాల వెనుక జగన్ హస్తం
ప్రధానమంత్రి పాల్గొన్న ప్రజాగళం సభకు ఆటంకాలు సృష్టించడం వెనుక ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందని మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. -
లక్షల మంది తరలివచ్చి కూటమిని ఆశీర్వదించారు
చిలకలూరిపేటలో భాజపా, తెదేపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వంటిది ఈ దశాబ్దంలో చూడలేదని జనం చెబుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపు చేపడితే మేలు
ఏపీలో మే 13న ఎన్నికలు ముగిశాక సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపును చేపట్టాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. -
జగన్ అరాచక పాలనకు మోదీ అండ: సీపీఐ
వైఎస్ వివేకా హత్య కేసు నిందితులను సీబీఐ ఇంతవరకు గుర్తించకపోవడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. -
కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్ యథావిధిగా జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. -
వైకాపా అధిష్ఠానానికి నగరి అసమ్మతి నేతల ఝలక్
చిత్తూరు జిల్లా నగరి సీటును మంత్రి రోజాకు కేటాయిస్తే తాము పని చేయమని వైకాపా అసమ్మతి నేతలు తెగేసి చెప్పినా, రెండ్రోజుల క్రితం ఆమె అభ్యర్థిత్వాన్నే జగన్ ఖరారు చేశారు. -
కడపలోనూ కొండలు కొల్లగొట్టేశారు...
ముఖ్యమంత్రి జగన్ సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో కొండలు, గుట్టలను వైకాపా నేతలు అయిదేళ్లుగా వరుసబెట్టి మింగేశారు.
తాజా వార్తలు (Latest News)
-
Suryakumar Yadav: ఐపీఎల్ మ్యాచ్లకు సూర్య దూరమేనా? ఇన్స్టా పోస్ట్ వైరల్
-
LS polls: డిపాజిట్ దక్కకున్నా పోటీకి సై.. 71 వేల మంది డిపాజిట్లు ‘గల్లంతు’
-
Hyderabad: ప్రణీత్రావుకు సహకరించింది ఎవరు?
-
IPL 2023 Rewind: గత సీజన్ ఐపీఎల్ హీరోలు.. లిస్ట్లో ఎవరున్నారంటే?
-
Vodafone Idea: ₹169 రీఛార్జితో 90 రోజుల డిస్నీ సబ్స్క్రిప్షన్.. వొడా కొత్త ప్లాన్
-
PM Modi: సేలం సభలో ప్రధాని మోదీ భావోద్వేగం