ఓటేసి తెరాసకు మద్దతివ్వండి: హోంమంత్రి

రాష్ట్రంలో త్వరలోనే ఉద్యోగుల సమస్యలతో పాటు ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థికి

Published : 10 Mar 2021 10:49 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో త్వరలోనే ఉద్యోగుల సమస్యలతో పాటు ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థికి మద్దతుగా హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఈ ఉదయం ఆయన ప్రచారం నిర్వహించారు. ఉదయపు నడకకు వచ్చిన వారితో మాట్లాడిన మంత్రి.. తెరాస సర్కారు చేపట్టిన అభివృద్ధి గురించి వివరించారు. రెండు స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. 

తెరాస ప్రభుత్వం హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్లు మహమూద్‌ అలీ వివరించారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం 1,33,001 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. అనేక పరిశ్రమలు పెట్టుబడుల ప్రోత్సాహంతో హైదరాబాద్ నగరం అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నట్లు ఆయన వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని