Gujarat Elections: కాంగ్రెస్ను వెంటాడుతున్న ఆప్.. ‘గుజరాత్’ ఆశలకూ గండి!
Gujarat Elections 2022: గుజరాత్లో మరోసారి కాంగ్రెస్ (Congress) ఆశలకు గండి పడింది. స్వీయ తప్పిదాలు కొంత కారణం కాగా.. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి పార్టీని దెబ్బ కొట్టింది.
అది 2017 డిసెంబర్ 18. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Gujarat election 2022) వెలువడుతున్న రోజు. ప్రధాన పోటీ భాజపా- కాంగ్రెస్ (BJP- congress) మధ్యే. ఓ దశలో కాంగ్రెస్ (Congress) గెలుస్తుందన్నంత పనిచేసింది. భాజపాకు (BJP) ఆ స్థాయిలో చెమటలు పట్టించింది. అయినా కొద్ది సీట్ల తేడాతో అధికారం చేజార్చుకుంది. ఓ 10 సీట్లు అటూ ఇటూ అయితే కాంగ్రెస్ను అధికారం వరించేదే! ఐదేళ్లు గిర్రున తిరిగాయ్. ఈసారి పోటీ ఏకపక్షమే. భాజపా దూకుడు ముందు కాంగ్రెస్ పార్టీ వెలవెలబోయింది. అధికార పార్టీని అందుకోలేనంత దూరంలో నిలిచింది. ఎన్నడూలేని రీతిలో 50 శాతానికి పైగా ఓట్లు, 150కి పైగా సీట్లతో భాజపా గెలుపు దిశగా పయనిస్తుండగా.. గత 27 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్కు మరోసారి భంగపాటు ఎదురైంది. దీనికి కారణం కాంగ్రెస్ స్వీయ తప్పిదాలు కొన్నైతే.. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మరో కారణం!!
చీలింది కాంగ్రెస్ ఓటే..!
ఏ పార్టీ అయినా ఐదేళ్లు అధికారంలో ఉంటే.. మరుసటి ఎన్నికల్లో ఎంతోకొంత ప్రభుత్వ వ్యతిరేకత మూట గట్టుకోవడం సర్వసాధారణం. అదే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 27 ఏళ్లు అంటే మామూలు విషయం కాదు. అందుకే 2017 ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎన్నడూ లేని స్థాయిలో 41 శాతం ఓట్లు వచ్చాయి. 77 సీట్లు వరించాయి. భాజపాకు 49 శాతం ఓట్లు 99 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసారి ఎన్నికల ఫలితాల విషయానికొచ్చేసరికి భాజపాకు వచ్చిన ఓటింగ్ శాతం మరింత పెరిగింది. దాదాపు 53 శాతానికి చేరింది. కాంగ్రెస్ ఓటింగ్ శాతం అనూహ్యంగా 27 శాతానికి తగ్గింది. ఆమ్ ఆద్మీ పార్టీ 12 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ మూడింట రెండొంతులు.. ఆప్ ఒక వంతు పంచుకున్నట్లు స్పష్టమవుతోంది.
అప్పుడు దిల్లీ, పంజాబ్.. ఇప్పుడు గుజరాత్
ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా నిలుస్తామంటూ రాజకీయాలను ప్రారంభించిన ఆప్.. కాంగ్రెస్ను మొదటి నుంచీ దెబ్బకొడుతూ వస్తోంది. తొలుత దేశ రాజధాని దిల్లీలో కాంగ్రెస్ను అధికారం నుంచి దూరం చేసింది. ఆ తర్వాత పంజాబ్లో అడుగుపెట్టి.. తొలి ప్రయత్నంలోనే ప్రతిపక్ష స్థానానికి చేరింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు గట్టి షాకిస్తూ.. అధికార స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పుడు గుజరాత్ ఎన్నికల్లోనూ అదే పనిచేసింది. ఏళ్లుగా ద్విముఖ పోరు ఉన్న గుజరాత్లో ప్రవేశించి త్రిముఖ పోరుగా మార్చిన ఆప్.. కాంగ్రెస్ను మరోసారి కోలుకోలేని దెబ్బకొట్టింది. ఒకవేళ ఆప్ పోటీలో లేకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా.. బహుశా మరోసారి భాజపాకు గట్టి పోటీ ఇచ్చేదేమో! కానీ, కాంగ్రెస్ అధికార ఆకాంక్షలకు, ఆశలకు గండికొట్టడమే కాదు.. ఆ పార్టీ ఆత్మస్థైర్యాన్ని సైతం ఆప్ దెబ్బతీసింది.
కాంగ్రెస్ స్వీయ తప్పిదాలు..
గుజరాత్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శనకు స్వీయ తప్పిదాలూ కారణమే. ఓ దశలో ఆ పార్టీ అసలు గుజరాత్లో పోటీలో ఉందా? అనేంతగా ఆ పార్టీ వ్యవహరించింది. భాజపా తన మందీమార్బలాన్నంతా ప్రయోగిస్తే.. ఆప్ తనకున్న పరిమిత వనరుల్ని వినియోగించుకుని భాజపాకు గట్టి పోటీ తామే అన్నట్లుగా ప్రచారం చేసుకుంది. కాంగ్రెస్ మాత్రం ఆ స్థాయిలో దూకుడు ప్రదర్శించలేదన్నది ప్రచార సరళిని చూసేవారికి ఇట్టే అర్థమవుతుంది. చివరి నిమిషంలో రాహుల్, ఖర్గే పర్యటనలు పార్టీ శ్రేణుల్లో కొంతమేర ఉత్సాహాన్నిచ్చినా అదీ పరిమితమే. ‘భారత్ జోడో యాత్ర’కు కొద్ది రోజులు ముందు గుజరాత్ నేతలతో భేటీ అయిన రాహుల్.. ఆ తర్వాత రెండు దశల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో పర్యటించింది కేవలం ఒక్కటే రోజు! దీనికి తోడు గత ఎన్నికల సమయంలో మోదీని ఉద్దేశించి మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ను కొంతమేర దెబ్బకొట్టగా.. ‘100 తలల రావణుడు’ అంటూ మోదీపై ఖర్గే చేసిన వ్యాఖ్యలను భాజపా తనకు అనుకూలంగా మలచుకోగలిగింది.
పటేల్ లేని లోటు..
గుజరాత్ కాంగ్రెస్ కీలక నేత, ఆ పార్టీ వ్యూహకర్త అహ్మద్ పటేల్ మరణం ఆ పార్టీకి తీరని లోటనే చెప్పాలి. ఏనాడూ మీడియాలో పెద్దగా కనిపించని అహ్మద్పటేల్.. తెరవెనుక రాజకీయాలు నెరపడంలో దిట్ట. అంతే కాదు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి కూడా. మొదటి నుంచీ భాజపా పక్షాన నిలిచిన పటేళ్లను 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్వైపు తిప్పుకోవడంలో ఆయన వ్యూహాలు గట్టిగానే పనిచేశాయి. పాటీదార్ ఉద్యమానికి నేతృత్వం వహించిన హార్దిక్ను పార్టీలో చేర్చుకోవడమూ ఇందులో భాగమే. అందుకే గత ఎన్నికల్లో ఆ పార్టీ ఆ స్థాయిలో ప్రదర్శన చేసింది. 2020లో కొవిడ్ సమయంలో తలెత్తిన అనారోగ్య పరిస్థితుల వల్ల ఆయన మరణించారు. దీంతో ఆ పార్టీ గుజరాత్లో పెద్ద దిక్కు కోల్పోయింది. హార్దిక్ పటేల్ భాజపా గూటికి చేరారు. మిగిలిన నేతలనూ అధిష్ఠానం లైట్ తీసుకుంది. దీంతో పార్టీ నేతల మధ్య సమన్వయ లేమి స్పష్టంగా ఎన్నికల్లో కనిపించింది.
మొత్తంగా ఈ సారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ స్ట్రోక్ కొంతయితే.. స్వీయ తప్పిదాలు కాంగ్రెస్ను మరోసారి గుజరాత్లో అధికారానికి బహుదూరం చేశాయి.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
‘కృష్ణుడి గోపికను నేనే’.. హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
Lok Sabha polls: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అబ్బో.. కేసుల్లోనూ ఘనులే
చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి. -
లోకేశ్ తరఫున నామినేషన్ దాఖలు
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు. -
రైతులను అప్పుల్లో ముంచిన జగన్
సీఎం జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటిని కప్పిపుచ్చి ప్రోగ్రెస్ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. -
సీఎం జగన్ అవినీతిపై ఛార్జిషీట్ విడుదల చేస్తాం
ముఖ్యమంత్రి జగన్ అవినీతిపై ఛార్జ్షీట్ రూపొందిస్తామని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
‘నాడు-నేడు’ కార్యశాల పేరిట వైకాపా డప్పు
గ్రామ స్వరాజ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉందని ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి, సీఎం సలహాదారుడు అజేయ కల్లం పేర్కొన్నారు.