karnatka Elections: పార్టీ ఫిరాయింపులు పని చేశాయా?
Karnataka Assembly Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలువురు నేతలు పార్టీని ఫిరాయించి వేరే పార్టీల్లో చేరారు. అయితే, వాళ్లను ప్రజలు ఎంతమేర ఆదరించారో పరిశీలిద్దామా?
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Assembly Elections) సీట్ల కేటాయింపు విషయంలో అన్ని పార్టీలూ మల్లగుల్లాలు పడ్డాయి. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి.. టికెట్ ఆశావాదులను చాలా వరకు బుజ్జగించగా.. భాజపా మాత్రం అందులో విఫలమైంది. కొత్త వారికి టికెట్లు కేటాయించాలన్న ఉద్దేశంతో ఆ పార్టీ అనుసరించిన విధానం కీలక నేతలను నొప్పించింది. దీంతో చాలా మంది పార్టీని ఫిరాయించారు. కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది బయటకి వచ్చారు. అయితే అలాంటి వారు ఈ ఎన్నికల్లో ఎంత మేరకు విజయం సాధించారన్నది ఓ సారి పరిశీలిస్తే..!
జగదీశ్ శెట్టర్
భాజపా తొలి విడత జాబితా ప్రకటించిన తర్వాత రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపించిన పేరు జగదీశ్ శెట్టర్. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న ఆయనకు భాజపా టికెట్ నిరాకరించడంతో, తీవ్ర అసహనానికి గురై పోలింగ్కు కొన్ని రోజుల ముందు ఆయన కాంగ్రెస్లో చేరారు. అధిష్ఠానం ఆయనకు హుబ్బళిలోని ధర్వాడ్ సెంట్రల్ స్థానాన్ని కేటాయించింది. కానీ, తాజాగా వెలువడిన ఫలితాల్లో జగదీశ్ శెట్టర్, భాజపా అభ్యర్థి మహేశ్ తెంగిన్కాయ్ చేతిలో 34,289 ఓట్ల భారీ తేడాతో పరాజయం పాలయ్యారు.
లక్ష్మణ్ సావడి
భాజపా నుంచి కాంగ్రెస్లో చేరిన మరో నేత లక్ష్మణ్ సావడి. అథానీ అసెంబ్లీ నియోజవర్గం నుంచి బరిలోకి దిగిన లక్ష్మణ్.. భాజపా అభ్యర్థి మహేశ్ కుమతల్లిపై 76,122 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ మహేశ్కుమతల్లి కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరడం గమనార్హం. లక్ష్మణ్ సావడి ఆగస్టు 2019 నుంచి జులై 2021 మధ్య కర్ణాటక ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.
కిరణ్ కుమార్
తుముకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి నుంచి కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహించిన కిరణ్ కుమార్ ఓటమి పాలయ్యారు. సమీప ప్రత్యర్థి, జేడీఎస్ అభ్యర్థి సురేశ్ బాబుపై 10,042 ఓట్ల తేడాతో పరాజయం చెందారు. కిరణ్కుమార్ గత ఫిబ్రవరిలో భాజపాను వీడి కాంగ్రెస్లో చేరారు.
హెచ్డీ తమ్మయ్య
అందరి దృష్టినీ ఆకర్షించిన చిక్మంగళూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన హెచ్డీ తమ్మయ్య.. భాజపా అభ్యర్థి సీటీ రవిని 5,926 ఓట్ల తేడాతో ఓడించారు. తమ్మయ్య గతంలో సీటీ రవికి సహాయకుడిగా పని చేశారు.
ఎంపీ కుమారస్వామి
ముదిగెరె స్థానాన్ని తనకు కేటాయించలేదనే కారణంతో భాజపాను వీడి జేడీఎస్లో చేరిన ఎంపీ కుమారస్వామి కూడా ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నయన మోతమ్మ చేతిలో 24,805 ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు. దీనిని బట్టి పార్టీని నుంచి వైదొలిగిన కొందరు అభ్యర్థులు లాభపడగా.. కొందరికి మాత్రం జెండా మార్చినా ఫలితం మారలేదని స్పష్టమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. -
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ తెదేపా అభ్యర్థి బొండా ఉమాను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. -
వాల్తేరు క్లబ్లో వైకాపా డిష్యుం డిష్యుం!
వాల్తేరు క్లబ్ ప్రభుత్వ భూమి. ఈ రోజుకూ నేను అదే చెబుతున్నా. ఏ రోజైనా ఒక సామాజికవర్గం చేతిలో ఉండి ఉండొచ్చు. -
నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు
నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు (Lok sabha Elections) నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. -
చీకటి పాలనకు చిరునామా.. జగనన్న కాలనీలు!
ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తాం.. అంటూ జగనన్న కాలనీల విషయంలో సీఎం జగన్ మొదటి నుంచీ గొప్పలు చెబుతున్నారు. -
వ్యూహకర్తలదే పెత్తనం!.. ప్రచారంలో పార్టీలను శాసించేది వారే
భారత రాజకీయాల్లో వ్యూహకర్తల పెత్తనం పెరిగిపోయింది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించే రోజులు పోయాయి. ప్రచారం మొత్తాన్ని వ్యూహకర్తలే శాసించే రోజులు వచ్చాయి. -
సార్వత్రిక సవాల్..
సార్వత్రిక ఎన్నికల సమరానికి రాష్ట్రం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల అనంతరం మరో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేస్తోంది. -
జగనాసురుడి ఓటమి ఖాయం
‘రాముడిని తలచుకుంటే.. మంచి పాలన గుర్తొస్తుంది. మనకూ మంచి పాలకులు కావాలి, సుపరిపాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రావణాసురుడిని చంపిన రాముడే ఆదర్శంగా.. ఈ రాష్ట్రంలోని ప్రజలంతా కలిసి తమ ఓట్లతో జగనాసురుడిని ఓడించేందుకు సిద్ధమయ్యారు. -
దుష్ట పాలనను అంతం చేద్దాం
శ్రీరామనవమి పర్వదినాన జనసేన అభ్యర్థులకు బీఫాంలను అందించడం ఆనందంగా ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ తెలిపారు. -
ఎన్నెన్నో హామీలిచ్చి.. ఆనక అయిదేళ్లూ ముంచేసి!
అయిదేళ్లలో జగన్ జిల్లాకు వచ్చినప్పుడల్లా ఇచ్చిన హామీల మొత్తం విలువ రూ.474 కోట్లు.. ఏటా గోదావరి వరదలకు కోనసీమ లంకల్లోని పల్లెలన్నీ వణికిపోయినా, గ్రామాలను అనుసంధానించే కాజ్వేలు మునిగిపోయినా నిధులు విడుదల చేయలేదు. -
తెదేపాలోకి మాజీ ఎమ్మెల్యే షేక్ సుభానీ
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగు దేశం పార్టీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. గుంటూరు తూర్పు తెదేపా అభ్యర్థి మహమ్మద్ నసీర్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే షేక్ సుభానీ బుధవారం ఉండవల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరారు. -
న్యాయమూర్తులపై దూషణ కేసు నిందితుడితో ఉన్న... జగన్, విజయసాయిరెడ్డిలు నేరస్థులే!
‘న్యాయమూర్తులను దూషించిన కేసులో రెండో నిందితుడు మణి అన్నపురెడ్డితో సన్నిహితంగా ఉండటంతో పాటు అతడికి ఆశ్రయమిస్తున్న సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి నేరస్థులే’ అని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. -
సాక్షిలో పనిచేసిన వారు, జగన్ బంధుమిత్రులే సలహాదారులు
సాక్షి మీడియాలో పనిచేసిన వారు, సీఎం జగన్ బంధుమిత్రులు, తెదేపా ప్రభుత్వంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసిన ఐఏఎస్ అధికారుల్నే వైకాపా ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకుందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
గులకరాయి డ్రామాలో బీసీలను బలిపశువులు చేస్తున్న జగన్
గులకరాయి డ్రామాలో బీసీలను బలిపశువులను చేయడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. -
జగన్పై దాడి కేసులో.. బొండా ఉమాను ఇరికించేందుకు వైకాపా కుట్ర
సీఎం జగన్పై రాయి దాడి కేసులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావును ఇరికించేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై ఆగని వైకాపా ఒత్తిళ్లు
వాలంటీర్లందరూ రాజీనామా చేసి ఆ పత్రాలను పంచాయతీ కార్యదర్శికి అందించాలి. అధికారంలోకి రాగానే వారందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటాం. -
వైకాపాకు అనుకూలంగా విజయవాడ సీపీ దర్యాప్తు
సీఎం జగన్పై రాయితో దాడి చేసిన ఘటనలో విజయవాడ పోలీస్ కమిషనర్(సీపీ) కాంతిరాణా వైకాపాకు అనుకూలంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
‘ముస్లింలలో అభద్రతాభావం సృష్టిస్తున్న వైకాపా’
ముస్లింలలో అభద్రతాభావాన్ని పెంచి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని సీఎం జగన్ కుట్రలు పన్నుతున్నారని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ మండిపడ్డారు. -
‘మోదీ వేవ్’ ఎప్పుడూ ఉంటుంది: నవనీత్ రాణా
దేశంలో ‘మోదీ వేవ్’ లేదని తాను వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతుండటంపై మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, సినీ నటి నవనీత్ రాణా బుధవారం స్పందించారు. -
‘ఆప్’ కా రామరాజ్య వెబ్సైట్ ప్రారంభం
లోక్సభ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను ప్రారంభించింది.