Gujarat Election 2022: చక్ దే బీజేపీ...వరుస విజయాలు.. ఎలా సాధ్యం?
సాధారణంగా రెండుమూడు సార్లు వరుసగా అధికారం చేపడితేనే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతుంది. అలాంటిది భాజపా ఇలా అప్రతిహత విజయాలతో దూసుకెళ్లడానికి కారణం ఏంటి?మోదీ, అమిత్షా లాంటి కీలక నాయకులు రాష్ట్ర రాజకీయాలను విడిచి.. కేంద్రానికి వెళ్లినా..భాజపా హవా ఎందుకు తగ్గలేదు?
ఇంటర్నెట్డెస్క్: గుజరాత్ (Gujarat)లో మరోసారి కమలం వికసించింది. వరుసగా ఏడోసారి భాజపా ప్రభంజనం సృష్టించింది. అధికారం కోసం కాంగ్రెస్, ఆప్ పార్టీల యత్నాలను తుత్తునియలు చేసి, 156 స్థానాల్లో గెలుపొంది రికార్డు స్థాయి విజయం సాధించింది. గుజరాత్ చరిత్రలో ఇప్పటి వరకు కాంగ్రెస్ (Congress) పేరిట (1985లో 149 స్థానాల్లో విజయం) ఉన్న రికార్డును చెరిపేసింది. ఇలా వరుస విజయాలు సాధించడం ఏపార్టీకైనా అంత సులభమేం కాదు. రెండుమూడు సార్లు వరుసగా అధికారం చేపడితేనే సాధారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతుంది. అలాంటిది భాజపా ఇలా అప్రతిహత విజయాలతో దూసుకెళ్లడానికి కారణం ఏంటి?మోదీ (Modi), అమిత్షా (Amit shah) లాంటి కీలక నాయకులు రాష్ట్ర రాజకీయాలను విడిచి.. కేంద్రానికి వెళ్లినా..భాజపా హవా ఎందుకు తగ్గలేదు?
‘జై’ కొడుతున్న పట్టణ ఓటర్లు
కేవలం భాజపా (BJP) వ్యతిరేక ఓట్లు చీలడం వల్లే కమలం పార్టీ ఇంతటి ఘన విజయం సాధించలేదు. భాజపా తన కోర్ ఓటర్లను నిలబెట్టుకుంది. గుజరాత్లో పట్టణ జనాభా అధికం. వారంతా కాషాయ పార్టీకే మద్దతు పలికారు. 1995లో తొలిసారి అధికారంలోకి వచ్చిన భాజపా ప్రధానంగా నగరాల అభివృద్ధివైపు దృష్టి సారించింది. మౌలిక సదుపాయాల కల్పన నుంచి..పెట్టుబడుల ఆకర్షించడం వరకు భాజపా పూర్తి స్థాయిలో విజయం సాధించింది. దీంతో పట్టణ ఓటర్లంతా భాజపాకే మొగ్గు చూపుతున్నారు.
హిందుత్వ మూలాలు
గుజరాత్లో అధిక సంఖ్యాకులు హిందువులు(Hindu). మిగతా సామాజిక వర్గాలు వారు ఉన్నప్పటికీ వారంతా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యారు. హిందుత్వ మూలాలున్న భాజపా వారి ఓట్లను ఆకర్షించడంలో ప్రతిసారీ పూర్తిగా సఫలమవుతోంది. మరోవైపు 1969లో మతకల్లోలాలతో గుజరాత్లో పాక్ వ్యతిరేక సెంటిమెంట్ బలపడింది. ఈ క్రమంలో హిందువులకు భాజపా తన పూర్తి మద్దతు ఇచ్చింది. దీంతో అధిక సంఖ్యాకులుగా ఉన్న హిందువులు అప్పటి నుంచి భాజపాకే మద్దతు పలుకుతున్నారు.
సంస్థాగతంగా బలోపేతం
భాజపాకు ఆర్ఎస్ఎస్ (RSS) వెన్నెముక అని చెబుతుంటారు. గుజరాత్లో ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎక్కువ. దీంతో ఆ సంస్థ సభ్యుల నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తూ సంస్థాగతంగా పార్టీ మరింత బలం పుంజుకుంది. దీని సాయంతో భాజపా క్షేత్ర స్థాయిలో ప్రజల మధ్యకు వెళ్లగలిగింది. వాళ్ల సమస్యలను తెలుసుకుంటూ..వాటి పరిష్కారానికి కృషి చేసింది. దీంతో కేవలం పట్టణ ఓటర్లను మాత్రమే కాకుండా గ్రామీణస్థాయి ఓటర్లను కూడా ఆకర్షించడంలో భాజపా పూర్తి స్థాయిలో సఫలమైంది.దీంతో గ్రామీణ స్థాయిలో మంచి పట్టున్న కాంగ్రెస్ ఈసారి రూరల్ నియోజవర్గాల్లోనూ ప్రభావం చూపలేకపోయింది.
గోద్రా అల్లర్లు
2002, ఫిబ్రవరి 27 జరిగిన గోద్రా రైలు దహనం గుజరాత్ రాజకీయాల్లో ప్రకంపనలు లేపింది. గోద్రా ( Godra) రైల్వే స్టేషన్లో సబర్మతీ ఎక్స్ప్రెస్ను దహనం చేయడంతో దాదాపు 59 మంది కరసేవకులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అయోధ్య కరసేవకు వెళ్లి తిరిగి వస్తున్న హిందూ యాత్రికులే ఎక్కువగా ఉన్నారు. అప్పటి నుంచి హిందూ సామాజిక వర్గానికి చెందిన వారిలో అగ్రభాగం భాజపాకే మద్దతు తెలుపుతున్నారు.
పెట్టుబడుల వరద
కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గుజరాత్కు పెట్టుబడులు (Investments) వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్, పెట్రోకెమికల్, డిజిటల్ బిజినెట్ ,సాంకేతిక తదితర రంగాల్లో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. భాజపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేవలం రిలయన్స్ సంస్థే రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఇటీవల ముకేశ్ అంబానీ చెప్పడమే ఇందుకు ఉదాహరణ. ఇటీవల రూ.22వేల కోట్లతో సైన్యానికి ఎయిర్క్రాఫ్ట్లు తయారు చేసేందుకు టాటా, ఎయిర్బస్ గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇదే కాకుండా పలు ఎలక్ట్రానిక్ సంస్థలు కూడా గుజరాత్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. మరోవైపు కేంద్రం నుంచి కూడా రాష్ట్రానికి నిధుల వరద పారుతోంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండటంతో పెట్టుబడి దారులు తమకు అనుకూలంగా భావిస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్షాల స్వరాష్ట్రం కూడా కావడం పెట్టుబడులకు మరింత ఊతమిస్తోంది.
ఏ చిన్న అవకాశం ఉన్నా.. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే ప్రాజెక్టులను తీసుకురావడంలో భాజపా సఫలమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్ హైవేను అహ్మదాబాద్, వడోదర, సూరత్ మీదుగా నిర్మిస్తున్నారు. రూ.98వేల కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే దిల్లీ నుంచి ముంబయికి కేవలం 12 గంటల్లో ప్రయాణించే వెసులుబాటు ఏర్పడుతుంది.
మోదీ బ్రాండ్
గుజరాత్లో మోదీ కీలకంగా మారిన తర్వాత.. అక్కడి రాజకీయాలు.. ‘మోదీకి ముందు.. ఆ తర్వాత’ అన్నంతలా మారిపోయాయి. అప్పటి వరకు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ను ఓ ప్రణాళిక ప్రకారం బలహీన పరచడంలో మోదీ నూరుపాళ్లు సఫలమయ్యారు. తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా రాష్ట్రంపై శ్రద్ధ వీడలేదు. పాటిదార్ల రిజర్వేషన్లతోపాటు గ్రామీణ ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని గ్రహించిన భాజపా అధిష్ఠానం భూపేంద్ర పాటిల్కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించి ప్రభుత్వంపై వ్యతిరేకతకు కళ్లెం వేశారు. మరోవైపు తాజా ఎన్నికల్లో తానే అభ్యర్థిని అన్నంతగా.. అంతా తానై మోదీ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల వేడి రాజుకున్న తర్వాత దాదాపు 20 రోజుల పాటు మోదీ రాష్ట్రంలోనే ఉండటమే ఇందుకు ఉదాహరణ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అబ్బో.. కేసుల్లోనూ ఘనులే
చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి. -
లోకేశ్ తరఫున నామినేషన్ దాఖలు
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు. -
రైతులను అప్పుల్లో ముంచిన జగన్
సీఎం జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటిని కప్పిపుచ్చి ప్రోగ్రెస్ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సీఎం జగన్ అవినీతిపై ఛార్జిషీట్ విడుదల చేస్తాం
ముఖ్యమంత్రి జగన్ అవినీతిపై ఛార్జ్షీట్ రూపొందిస్తామని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
‘నాడు-నేడు’ కార్యశాల పేరిట వైకాపా డప్పు
గ్రామ స్వరాజ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉందని ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి, సీఎం సలహాదారుడు అజేయ కల్లం పేర్కొన్నారు. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
నేడు నామినేషన్ వేయనున్న పురందేశ్వరి
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరం అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది. -
రాష్ట్రంలో నాలుగు చోట్ల మోదీ సభలు
ఎన్డీయే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో నాలుగు బహిరంగ సభలకు హాజరుకానున్నారు. -
అంబటి, అనిల్కుమార్లపై సీఈఓకు తెదేపా ఫిర్యాదు
ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీ కప్పులపై తమ బొమ్మలు ముద్రించి టీ స్టాళ్లకు పంపిణీ చేస్తున్న వైకాపా అభ్యర్థులు అంబటి రాంబాబు, అనిల్కుమార్లపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. -
పొన్నూరు వైకాపా అభ్యర్థిపై చర్యలకు ఆదేశం
గుంటూరు జిల్లా పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. -
రాష్ట్రంలో తొలిరోజు 229 నామినేషన్లు
రాష్ట్రంలో తొలిరోజు లోక్సభ స్థానాలకు 39 నామినేషన్లు, శాసనసభ స్థానాలకు 190 నామినేషన్లు దాఖలయ్యాయి. -
21న తెదేపా అభ్యర్థులకు బి-ఫాంలు
తెదేపా అధినేత చంద్రబాబు ఈ నెల 21న పార్టీ అభ్యర్థులకు స్వయంగా బి-ఫాంలు అందజేయనున్నారు. -
పవన్ సమక్షంలో జనసేనలో చేరికలు
మాజీ మంత్రి దివంగత వట్టి వసంతకుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్కుమార్ సహా పలువురు నాయకులు గురువారం జనసేనలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు