Election Result 2022:ఈ ఫలితాల నుంచి మేం నేర్చుకుంటాం..రాహుల్ ట్వీట్
ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడుతున్నాయి. యూపీలో మరోసారి భాజపా జయకేతనం ఎగురవేయగా.. పంజాబ్లో
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడుతున్నాయి. యూపీలో మరోసారి భాజపా జయకేతనం ఎగురవేయగా.. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఇక, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్కు మరోసారి భంగపాటే ఎదురైంది. ఈ నేపథ్యంలో ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్ ద్వారా స్పందించారు. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నట్లు తెలిపారు.
‘‘ప్రజల తీర్పును గౌరవంగా అంగీకరిస్తున్నాం. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈ ఎన్నికల కోసం పని చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, వాలంటీర్లకు కృతజ్ఞతలు. ఈ ఫలితాల నుంచి మేం నేర్చుకుంటాం. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తాం’’ అని రాహుల్ ట్విటర్లో రాసుకొచ్చారు.
తాజాగా వెలువడిన ఫలితాల ప్రకారం.. యూపీలో కాంగ్రెస్ మరోసారి సింగిల్ డిజిట్కే పరిమితమైంది. కేవలం 3 స్థానాలు మాత్రమే దక్కించుకోగలిగింది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న పంజాబ్లో ఘోర పరాభవం పొందింది. ఈ రాష్ట్రంలో కనీసం 20 స్థానాల్లోనూ గెలవలేకపోయింది. ఉత్తరాఖండ్లో 17 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమైంది. గోవాలో 12 చోట్ల విజయం సాధించింది. మణిపూర్లో 2 స్థానాల్లో గెలిచి 9 చోట్ల ఆధిక్యంలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె