‘సీఎం పదవా? నాకంత తొందరేం లేదు’
ముఖ్యమంత్రి కావడంపై తనకంత తొందరేమీ లేదని కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మంత్రి అశోక్ చవాన్ అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రస్తుతం పూర్తి మద్దతుతో పాలన.........
నాందేడ్: ముఖ్యమంత్రి కావడంపై తనకంత తొందరేమీ లేదని కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మంత్రి అశోక్ చవాన్ అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రస్తుతం పూర్తి మద్దతుతో పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో ఎక్కువకాలం ఉన్నవారెవరైనా సీఎం కావాలని కోరుకుంటారంటూ ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. బోకోర్ పట్టణంలో ఓ ర్యాలీలో మాట్లాడిన ఆయన.. ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా.. తామంతా మనస్ఫూర్తిగా ఆయనతోనే ఉన్నామన్నారు. సీఎం కావడంపై తనకేమీ తొందరలేదంటూ వ్యాఖ్యానించారు.
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు ఒక వేదికపైకి వచ్చి మహా వికాస్ అఘాడిగా ఏర్పడటం ద్వారా రాష్ట్రంలో భాజపాను బహిష్కరించడంలో విజయవంతమైనట్టు చెప్పారు. కొంతమంది సమస్యలు సృష్టించాలని ప్రయత్నించినా అవి విజయవంతం కావన్నారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పూర్తికాలం పాటు కొనసాగుతుందని అశోక్ చవాన్ స్పష్టంచేశారు. గతంలో 2008-10 మధ్య కాలంలో మహారాష్ట్ర సీఎంగా అశోక్చవాన్ పనిచేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?