Rahul Gandhi: భాజపా నాకు గురువు.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు చేశారు. ఎలా ఉండకూడదో వారి నుంచే నేర్చుకుంటున్నానంటూ కాషాయ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
దిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ను తాను గురువుల్లా భావిస్తానని అంటున్నారు కాంగ్రెస్ (Congress) అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi). వారిని చూసే ఎలా ఉండకూడదో.. ఎలాంటి పనులు చేయకూడదో నేర్చుకుంటున్నానంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ‘భారత్ జోడో యాత్ర’ నుంచి విరామం తీసుకున్న రాహుల్.. శనివారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, భాజపాపై విమర్శలు చేశారు. ఏ కారణం లేకపోవడంతో ‘భద్రతా ఉల్లంఘన’ పేరుతో తనపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు.
‘‘భారత్ జోడో (Bharat Jodo Yatra)ను నేను కేవలం యాత్రగానే ప్రారంభించా. కానీ, ఇది ప్రజల గొంతుక అవుతుందని ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ సందర్భంగా భాజపా, ఆర్ఎస్ఎస్ నేతలకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. వారు ఎంతగా మమ్మల్ని టార్గెట్ చేస్తే.. మేం అంతగా దృఢంగా మారుతాం. వారు మరింత దూకుడుగా మాపై విమర్శలు సాగించాలని కోరుకుంటున్నా. వారిని(భాజపా, ఆరెఎస్ఎస్) నేను గురువులుగా భావిస్తున్నా. వారిని చూసే ఎలాంటి పనులు చేయకూడదో నేర్చుకుంటున్నా’’ అని రాహుల్ (Rahul Gandhi)ఎద్దేవా చేశారు.
అనంతరం, ఇటీవల ‘భద్రతా ఉల్లంఘనల’ వ్యవహారంపై రాహుల్ స్పందించారు. ‘‘బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వెళ్లాలని హోంశాఖ చెబుతోంది. అలా ఎలా చేయగలను? యాత్రలో నేను కాలినడకనే వెళ్లాలి. అప్పుడు కూడా భద్రత ఎలా ఇవ్వాలో వారికి తెలుసు. కావాలనే రాద్దాంతం చేస్తున్నారు. ఏ కారణం లేకపోవడంతో భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ నాపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు(భాజపా) యాత్రలు చేసినప్పుడు ఎలా భద్రత ఇస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. ఇప్పటివరకు భారత్ జోడో యాత్ర విజయవంతంగా సాగిందని రాహుల్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలు కొత్త మార్గంలో ఎలా ఆలోచించాలో చెప్పేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
టీషర్టుపై ఎందుకంత ఆసక్తి..?
ఇక, ఈ యాత్రలో రాహుల్ ధరించిన టీ-షర్టులపై భాజపా (BJP), కాంగ్రెస్ (Congress) మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘టీ-షర్టుపైన ఎందుకంత రగడ. నాకు చలి అంటే భయం లేదు. పెద్దగా చలి అనిపించలేదు. అందుకే స్వెటర్ వేసుకోలేదు. ఒకవేళ చలి ఎక్కువైతే స్వెటర్ గురించి ఆలోచిస్తా’’ అని తెలిపారు. ఈ యాత్రలో ఉత్సాహంగా ఉండటం వెనుక ఉన్న సీక్రెట్ గురించి తర్వాత ఓ వీడియో విడుదల చేస్తానని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని