‘నాన్నను చంపినవారిపై కోపం లేదు’
తన తండ్రి రాజీవ్గాంధీని హత్య చేసిన వారిని తాను క్షమించానని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ మేరకు బుధవారం పుదుచ్చేరిలో జరిగిన ఓ సమావేశంలో ఆయన వెల్లడించారు. అక్కడి భారతీదాసన్ మహిళా కళాశాల విద్యార్థినులతో ముచ్చటించిన ఆయన, ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని తెలిపారు.
పుదుచ్చేరిలో రాహుల్గాంధీ
పుదుచ్చేరి: తన తండ్రి రాజీవ్గాంధీని హత్య చేసిన వారిని తాను క్షమించానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఈ మేరకు బుధవారం పుదుచ్చేరిలో జరిగిన ఓ సమావేశంలో ఆయన వెల్లడించారు. అక్కడి భారతీదాసన్ మహిళా కళాశాల విద్యార్థినులతో ముచ్చటించిన ఆయన, ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని తెలిపారు. ‘‘ మీ నాన్నగారిని ఎల్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) కు సంబంధించిన వ్యక్తులు హత్య చేశారు. వారిపై మీ అభిప్రాయం ఏమిటి?’’ అని ఓ విద్యార్థిని ప్రశ్నించింది. ‘‘ నా తండ్రి మరణం నన్ను ఎంతగానో కుంగదీసింది. కానీ నాకు ఎవరిపైనా కోపం, ద్వేషం లేవు. నేను దీనికి కారణమైన వారిని క్షమించాను. హింస వల్ల ఎవరికీ ఏమీ రాదు. మా నాన్న నాతోనే, నాలోనే ఉన్నారు. నా ద్వారా మాట్లాడుతున్నారు.’’ అని రాహుల్ గాంధీ తెలిపారు.
పుదుచ్చేరిలో నెలరోజుల వ్యవధిలో కాంగ్రెస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ బలం తగ్గుతుండంతో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. ఈ రోజు ఉదయం పుదుచ్చేరికి వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడి మత్సకారులను కలిసి వారితో మాట్లాడారు. అనంతరం విద్యార్థినులతో ముచ్చటించారు. మరోవైపు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న కిరణ్ బేదీని ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు మంగళవారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?