అధికారంలోకి వస్తే సీఏఏను అమలుచేయబోం: స్టాలిన్
తమిళనాడులో తాము అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలుచేయబోమని డీఎంకే అధినేత స్టాలిన్ స్పష్టం చేశారు. సీఏఏపై పార్లమెంట్లో భాజపాకు మద్దతిచ్చిన అన్నాడీఎంకేపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు....
చెన్నై: తమిళనాడులో తాము అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలుచేయబోమని డీఎంకే అధినేత స్టాలిన్ స్పష్టం చేశారు. సీఏఏపై పార్లమెంట్లో భాజపాకు మద్దతిచ్చిన అన్నాడీఎంకేపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అన్నాడీఎంకే, పీఎంకే సభ్యులు సీఏఏకు మద్దతుగా రాజ్యసభలో ఓటు వేసిన విషయాన్ని స్టాలిన్ గుర్తుచేశారు. జోలార్పేట్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్టాలిన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఏఏపై అన్నాడీఎంకే నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. మైనారిటీలకు డీఎంకే ఎప్పుడూ మద్దతుగానే నిలుస్తుందన్న ఆయన తాము పార్లమెంట్లో ఈ బిల్లును వ్యతిరేకించామని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబంలోని ఓ మహిళకు రూ.వెయ్యి ఇస్తామని.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని స్టాలిన్ హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ