Maharashtra Crisis: ‘శివసైనికులు గనక బయటకొస్తే..’ సంజయ్ రౌత్ ఘాటు హెచ్చరిక
ముంబయి: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై తాజాగా శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు శివసైనికులు ఓర్పుతో ఉన్నారని వ్యాఖ్యానించారు. సమయం గడుస్తున్న కొద్దీ వారి సహనం నశిస్తోందన్నారు. ఇంకా వారు బయటకు రాలేదన్నారు. ‘‘ఒకవేళ వారే గనక బయటకొస్తే వీధుల్లో అగ్గి రాజేసుకుంటుంది’’ అని హెచ్చరించారు. తాజా సంక్షోభం నేపథ్యంలో పార్టీ నేడు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. దానికి వెళ్లడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్సీపీ అధినేత శరద్పవార్తో శుక్రవారం రాత్రి భేటీ అయినట్లు సంజయ్ రౌత్ తెలిపారు. ఆ సమయంలో పది మంది రెబల్ ఎమ్మెల్యేల నుంచి తమకు ఫోన్ వచ్చిందని వెల్లడించారు. సభలో విశ్వాస పరీక్షకు రావాలని సవాల్ విసిరారు. అప్పుడు ఎవరు బలవంతులో తేలుతుందని వ్యాఖ్యానించారు. నేడు జరగబోయే సమావేశంలో పార్టీ విస్తరణ, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామన్నారు. శివసేన చాలా పెద్దది అని.. దాన్ని ఎవరూ హస్తగతం చేసుకోలేరని వ్యాఖ్యానించారు. ఎన్నో త్యాగాల వల్ల పార్టీ నిర్మాణం జరిగిందన్నారు. దాన్ని ధనబలంతో ఎవరూ ధ్వంసం చేయలేరన్నారు.
మరోవైపు పుణెలోని రెబల్ ఎమ్మెల్యే తానాజీ సావంత్ కార్యాలయంపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. ప్రస్తుతం ఆయన శిందే వర్గంతో కలిసి గువాహటిలో ఉన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: మేకప్మ్యాన్ని మెచ్చిన సన్నీ లియోనీ.. విజయ్తో అనన్య స్టిల్స్
-
General News
Telangana News: ఎస్ఐ పరీక్షకు 2.25లక్షల మంది హాజరు.. త్వరలోనే ప్రిలిమినరీ ‘కీ’
-
Politics News
Bandi Sanjay: కేసీఆర్.. తెలంగాణ డబ్బులు పంజాబ్లో పంచి పెడతారా?: బండి సంజయ్
-
General News
Andhra News: ఉత్తరాంధ్రకు వాయు‘గండం’.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
-
Politics News
KTR: కేంద్రం నిర్ణయం చేనేత పరిశ్రమకు మరణశాసనమే: కేటీఆర్
-
Sports News
INDw vs AUSw : అమ్మాయిలూ... ప్రతీకారం తీర్చుకోవాలి.. పసిడి పట్టేయాలి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- Nithya Menen: అతడు నన్ను ఆరేళ్లుగా వేధిస్తున్నాడు.. 30 నంబర్లు బ్లాక్ చేశా: నిత్యామేనన్
- Allu Arjun: కల్యాణ్రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- అక్క కాదు అమ్మ.. చెల్లి కాదు శివంగి
- Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
- ఫైర్ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?
- సూర్య అనే నేను...
- నిమిషాల్లో వెండి శుభ్రం!