Nagaland Election: ఓటర్లలో సగం అతివలే.. అయినా 60ఏళ్లలో ఒక్క మహిళా గెలవలేదు..
ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన నాగాలాండ్ (Nagaland)లో ఇప్పటివరకు ఒక్క మహిళా ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టలేదు. మరికొద్ది రోజుల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరి ఈసారైనా నాగా చరిత్ర మారుతుందా?
ఇంటర్నెట్ డెస్క్: మహిళా రాష్ట్రపతి, మహిళా ప్రధానమంత్రి, అనేక రాష్ట్రాలకు మహిళా ముఖ్యమంత్రులను ఎన్నుకున్న దేశం మనది. కౌన్సిలర్ల నుంచి కేబినెట్ పదవుల వరకు ఇప్పుడు అన్నింటా మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ, ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ (Nagaland) మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. 60 ఏళ్ల ఆ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకూ ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. అలాగని అక్కడి మహిళల్లో రాజకీయ, సామాజిక చైతన్యం లేదని కాదు. ఓటర్లలో దాదాపు సగం మంది మహిళలే. మహిళా అక్షరాస్యత కూడా 75శాతానికి పైనే ఉంది. అయినా కండబలం, ధనబలం విషయంలో వాళ్లు మగవాళ్లతో ఎన్నికల బరిలో పోటీ పడలేకపోతున్నారు.
సరిగ్గా 60 ఏళ్ల క్రితం 1963లో నాగాలాండ్కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లభించింది. అప్పటి నుంచి ఈ ఈశాన్య రాష్ట్రంలో 13 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. కానీ, ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీ (Assembly)లో అడుగుపెట్టకపోవడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం 13.17లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో దాదాపు సగం 6.56లక్షల మంది మహిళా ఓటర్లే. అయినా, ఇప్పటివరకు అక్కడ జరిగిన మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) కేవలం 20 మంది మహిళలు మాత్రమే పోటీ చేసి విఫలమయ్యారు. 2018లో అత్యధికంగా ఐదుగురు ఎన్నికల్లో బరిలోకి దిగగా.. వారిలో ముగ్గురికి కనీసం ఆరోవంతు ఓట్లు కూడా రాలేదు.
అతివలు నిర్ణయాలు తీసుకోలేరట..
నాగాలాండ్ (Nagaland)లో మహిళలు రాజకీయాల్లోకి రావడంపై అనాదిగా వ్యతిరేకత కొనసాగుతోంది. 2017లో పురపాలిక ఎన్నికల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఆ హింసాత్మక ఘర్షణల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు కూడా. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే పదవులను మహిళలు నిర్వర్తించలేరనేది అక్కడి వారి భావన. అందుకే రాజకీయ పార్టీలు కూడా మహిళలు టికెట్లు ఇచ్చేందుకు ఇష్టపడవు. అంతెందుకు.. మహిళా ఓటర్లు (Women Voters) కూడా మహిళా అభ్యర్థులకు ఓటేసేందుకు ముందుకు రారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో ఒకే ఒక్క మహిళ గ్రామ కౌన్సిల్ ఛైర్పర్సన్గా ఎన్నికయ్యారు.
రాజ్యసభకు తొలి మహిళ..
శాసనసభలోనే కాదు.. పార్లమెంట్లోనూ ఇదే పరిస్థితి. దాదాపు 40 ఏళ్ల తర్వాత గతేడాది ఆ రాష్ట్రం నుంచి రెండో మహిళ పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2022లో నాగాలాండ్ నుంచి రాజ్యసభ (Rajya Sabha) సభ్యురాలిగా ఎన్నికైన ఫంగ్నోన్ కొన్యాక్ (Phangnon Konyak).. ఆ రాష్ట్రం నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు సాధించారు. అంతకుముందు 1977లో నాగాలాండ్ నుంచి రానో ఎం షాయిజా లోక్సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.
ఈసారైనా ‘నాగా’ చరిత్ర మారుతుందా?
నాగాలాండ్ (Nagaland)లో ఫిబ్రవరి 27న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనూ కేవలం నలుగురు మహిళలు పోటీలో ఉన్నారు. లింగ సమానత్వం హామీతో ప్రచారం చేపట్టిన అధికార నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ NDPP).. ఈ ఎన్నికల్లో ఇద్దరు మహిళలను బరిలోకి దించగా.. కాంగ్రెస్ (Congress), భాజపా (BJP) ఒక్కో మహిళకు టికెట్ ఇచ్చింది. మరి ఈసారైనా నాగా చరిత్ర మారుతుందా? శాసనసభలోకి ఓ మహిళ ఎమ్మెల్యేగా అడుగుపెట్టగలుగుతుందా? అనేది తెలియాలంటే మార్చి 12న వెలువడే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
పెండింగ్లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
బిహార్లో సీట్ల లెక్క తేలింది. ఇండియా కూటమి పార్టీలు పోటీ చేయబోయే స్థానాలు ఖరారయ్యాయి. -
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. -
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
శూన్యం నుంచి సునామీ సృష్టించి.. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. -
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
సీఎం రేవంత్రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి కాదా అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి
పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు. -
కాళేశ్వరం, కేసీఆర్పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. -
సంక్షిప్త వార్తలు (7)
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6న జైపుర్లో కాంగ్రెస్ మేనిఫెస్టో
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపుర్లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. -
జగన్పై ఒంటరిగానే నా పోరాటం
‘ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM