Oxygen పెంచండి..లేదంటే ప్రాణాలు పోతాయ్!
ప్రధాని మోదీకి పశ్చిమ్బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత అంశంపై వరుసగా రెండో రోజు కూడా ఆమె మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పాడుతోందని లేఖలో..
మమతా బెనర్జీ
కోల్కతా: ప్రధాని మోదీకి పశ్చిమ్బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత అంశంపై వరుసగా రెండో రోజు కూడా ఆమె మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పాడుతోందని లేఖలో పేర్కొన్నారు. మెడికల్ ఆక్సిజన్ వినియోగం అనూహ్యంగా పెరిగిపోతోందని, ప్రస్తుతం రోజుకు 470 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమవుతోందని, రానున్న వారంలో రోజుల్లో ఇది 550 మెట్రిక్ టన్నులకు పెరిగిపోయే అవకాశముందని ఆమె తెలిపారు.
‘‘రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 470 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమైంది. మరో ఏడెనిమిది రోజుల్లో ఇది 550మెట్రిక్ టన్నులకు చేరుకునే అవకాశముంది’’ అని మమత తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇదే అంశాన్ని కేంద్ర ఉన్నత స్థాయి అధికారులతోపాటు, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి దృష్టి కూడా తీసుకెళ్లారని, వీలైనంత తొందరగా రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరాను పెంచాలని కోరారు.
అన్ని రాష్ట్రాలకు గతంలో ఇచ్చిన దానికంటే కేంద్రం ఆక్సిజన్ సరఫరాను పెంచిందని, బెంగాల్పై మాత్రం శీతకన్ను వేసిందని మమత ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపు 560 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నా.. రాష్ట్రానికి 308 టన్నులు మాత్రమే దక్కుతోందని ఆమె పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో భారీ స్థాయిలో ఆక్సిజన్ అవసరమున్నందున కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. లేని పక్షంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందన్నారు.
దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో ఆక్సిజన్కు తీవ్ర సమస్య ఏర్పడుతోంది. ఇవాళ దేశంలో నాలుగు లక్షల కేసులు నమోదైతే అందులో 18,000 కేసులు బంగాల్లోనే నమోదయ్యాయి. రాష్ట్రంలో 1.2 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్లు అక్కడి ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఆక్సిజన్ సమస్య కేవలం పశ్చిమ్బంగాల్లోనే కాదు.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. కొన్ని రాష్ట్రాలకు దీనిపై కోర్టులకు కూడా వెళ్తున్నాయి. దిల్లీకి ప్రతిరోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను సరఫరా చేయాలన్న సుప్రీం కోర్టు.. కర్ణాటకకు కూడా ప్రాణవాయువు సరఫరాను పెంచాలని ఆదేశించిన విషయం తెలిసందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం