Congress: కాంగ్రెస్‍ నేతల మధ్య మళ్ళీ భగ్గుమన్న విభేదాలు

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ నేతల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి.

Published : 24 May 2022 20:23 IST

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ నేతల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. లింగంపేట మండలం కోమటిపల్లిలో కాంగ్రెస్ నేతలు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తలెత్తిన వివాదం మదన్‌ మోహన్, సుభాష్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణకు దారితీసింది. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మదన్ మోహన్ రావు, ఎల్లారెడ్డి అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ సుభాష్ రెడ్డి వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని