Meghalaya: కాంగ్రెస్ను ‘పీకే’స్తున్నాడా..? ఆయన దెబ్బకు మేఘాలయలో ‘హస్త’వ్యస్తం..!
ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్కు గట్టి కుదుపు.. ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి పార్టీని వీడి తృణమూల్ గూటికి పయనం.. దెబ్బకు ప్రతిపక్ష
మేఘాలయ పరిణామాల వెనుక రాజకీయ వ్యూహకర్త!
ఇంటర్నెట్డెస్క్: ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్కు గట్టి కుదుపు.. ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి పార్టీని వీడి తృణమూల్ గూటికి పయనం.. దెబ్బకు ప్రతిపక్ష హోదా గల్లంతు.. రాత్రికి రాత్రే మారిన సమీకరణాలు.. ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో హస్తం పార్టీ అస్తవ్యస్తానికి కారణమేంటీ అంటే.. ప్రశాంత్ కిశోర్ పేరు వినిపిస్తోంది. ఆయన వ్యూహానికి ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ కోట పేకమేడలా కూలిపోయింది..!!
మేఘాలయలో కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా కూడా ఉండటం గమనార్హం. మొత్తం 60 సీట్లు ఉన్న అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్ర పక్షం తరఫున 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో కొంతమంది ఆ తర్వాత పార్టీ మారగా.. కాంగ్రెస్ సంఖ్యా బలం 17కు తగ్గింది. ఇప్పుడు ఇందులోని 12 మంది టీఎంసీ గూటికి చేరడంతో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. తృణమూల్ రాత్రికి రాత్రే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించడం గమనార్హం.
పీకే డైరెక్షన్లో మాజీ సీఎం యాక్షన్..
కాంగ్రెస్ను వీడటానికి కొద్ది రోజుల ముందు మాజీ సీఎం ముకుల్ సంగ్మా కోల్కతా వెళ్లారు. అక్కడ ప్రశాంత్ కిశోర్తో సంగ్మా భేటీ అయ్యారు. అయితే అది మర్యాద పూర్వక భేటీ మాత్రమే అని చెప్పినప్పటికీ ముకుల్ పార్టీ మారే అవకాశాలున్నట్లు అప్పటి నుంచే సంకేతాలు కన్పించాయి. ఆ తర్వాత దిల్లీలోనూ వీరిద్దరూ పలుమార్లు భేటీ అయ్యారు. తాజాగా ఆయన మాట్లాడుతూ పీకే గురించి ప్రస్తావించారు. ‘‘నా స్నేహితుడు ప్రశాంత్ కిశోర్ను కలవడం ఆనందంగా ఉంది. మా ఇద్దరి లక్ష్యాలు ఒకటే. మార్పు కోసం నిరంతరం తపించే నాకు ఇదే సరైన సమయమని పీకే సూచించారు’’ అని చెప్పడం గమనార్హం.
కాంగ్రెస్ కోటకు బీటలు..
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన పీకే.. ఇప్పుడు మేఘాలయలోనూ టీఎంసీతో కలిసి పనిచేస్తున్నారు. కొద్ది నెలల క్రితం ప్రశాంత్ కిశోర్ కూడా మేఘాలయలో కన్పించారు. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీపై అంసతృప్తిగా ఉన్న సంగ్మాపై దృష్టి పెట్టి ఆ పార్టీని గట్టిగా దెబ్బ కొట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో బలమైన పార్టీగా కొనసాగిన కాంగ్రెస్కు మేఘాలయలో గట్టి పట్టు ఉంది. అయితే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ.. కాంగ్రెస్కు గుడ్బై చెప్పి.. ఎన్డీయేతో జట్టుకట్టింది. ఆ ఎన్నికల్లో ఎన్పీపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఓటమి నుంచి కోలుకుని వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. హస్తం పార్టీ ఆశలపై పీకే నీళ్లు గుమ్మరించారు.
ఆ నిర్ణయమే కొంపముంచిందా..
మేఘాలయ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా విన్సెంట్ పాలాను నియమిస్తూ ఇటీవల అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ముకుల్ సంగ్మా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి సంగ్మా, పార్టీకి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే తన అనుయాయులతో కలిసి సంగ్మా.. కాంగ్రెస్కు బై చెప్పి తృణమూల్లో చేరారు. ఈశాన్య భారత కాంగ్రెస్లో బలమైన నేతగా పేరొందిన ముకుల్ సంగ్మా.. పార్టీని వీడటం హస్తం పార్టీకి గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఈ పరిణామాలతో మేఘాలయాలో టీఎంసీ.. కాంగ్రెస్ కంటే బలమైన ప్రతిపక్ష పార్టీగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, రాహుల్గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. -
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత