BJP Vs JDU: భాజపాతో బంధానికి బీటలు.. సోనియాకు నీతీశ్ కాల్ చేశారా..?
బిహార్ అధికార కూటమి జేడీయూ, భాజపాలో సంక్షోభం ముదురుతోంది. ఏ క్షణమైనా కమలం పార్టీతో నీతీశ్ కుమార్ పార్టీ తెగదెంపులు చేసుకునేలా పరిణామాలు మారుతున్నాయి.
(నీతీశ్ ట్విటర్ ఖాతా నుంచి)
పట్నా: బిహార్ అధికార కూటమి జేడీయూ, భాజపాలో సంక్షోభం ముదురుతోంది. ఏ క్షణమైనా కమలం పార్టీతో నీతీశ్ కుమార్ పార్టీ తెగదెంపులు చేసుకునేలా పరిణామాలు మారుతున్నాయి. జేడీయూ పార్టీ మాజీ నేషనల్ ప్రెసిడెంట్, కేంద్ర మాజీ మంత్రి ఆర్సీపీ సింగ్ రాజీనామాతో సంకీర్ణ కూటమి బంధం మరింత బీటలు వారింది. బిహార్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధినేత్రికి ఫోన్ చేశారనే వార్తలు, ఆయన పట్ల ఆర్జేడీ మృదువైఖరితో కొత్త పొత్తులు ఉదయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలోనే రేపు జేడీయూ తన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించడం కీలకంగా మారనుంది.
25 రోజుల వ్యవధిలో 4 సమావేశాలకు గైర్హాజరు..
ఆదివారం ప్రధాని మంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్ సమావేశానికి నీతీశ్ గైర్హాజరయ్యారు. ఇటీవల కొవిడ్ బారినపడిన నీతీశ్ నీరసంగా ఉండటం వల్లే నీతిఆయోగ్ సమావేశానికి హాజరుకాలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే అయన అదేరోజు పట్నాలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం. గతకొద్దికాలంగా భాజపా, జేడీయూ మధ్య సఖ్యత లేదని వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేసేలా జులై 17 నుంచి జరిగిన నాలుగు సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరు కాలేదు. ఈ పరిణామాల మధ్య ఆగస్టు 11లోగా కూటమి ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అలాగే జేడీయూకు చెందిన ఎమ్మెల్యేలు మధ్యంతర ఎన్నికలకు వెళ్లడానికి సుముఖత చూపడం లేదు. దాంతో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకొని అధికారాన్ని కాపాడుకుంటారనే అంచనాలు వెలువడుతున్నాయి.
ఆజ్యం పోసిన ఆర్సీపీ సింగ్..
జేడీయూ నేత ఆర్సీపీ సింగ్ రాజీనామాతో కాషాయ పార్టీ, నీతీశ్ బంధానికి మరింత బీటలువారాయి. అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సింగ్ను జేడీయూ ఆదేశించిన నేపథ్యంలో ఆయన శనివారం పార్టీని వీడారు. కొద్ది నెలలుగా బిహార్ ముఖ్యమంత్రికి, సింగ్కు పొసగడం లేదని, అలాగే ఆయనకు భాజపాతో అనుబంధం పెరిగిందని రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఈ నేతను నీతీశ్ మూడోసారి రాజ్యసభకు నామినేట్ చేయకపోవడంతో.. ఆయన కేంద్ర కేబినెట్ నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామం సింగ్ను సొంతపార్టీకి మరింత దూరం చేసింది. ఈ నేపథ్యంలో లోక్జనశక్తి పార్టీని చీల్చిన మాదిరిగానే.. తమ పార్టీని చీల్చాలని కమలం పార్టీ కుట్ర చేస్తోందని జేడీయూ నేషనల్ ప్రెసిడెంట్ లాలన్ సింగ్ ఆరోపించారు. సింగ్ రాజీనామాపై మాట్లాడుతూ.. ‘ఆయన నిన్ననే పార్టీని వీడి ఉండొచ్చు. కానీ చాలాకాలంగా ఆయన మనసు ఎక్కడో ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు.
సోనియాకు నీతీశ్ ఫోన్..!
ఈ సంక్షోభ సమయంలో నీతీశ్ కుమార్ రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా దానికి హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి నీతీశ్ ఫోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ వీటిని ఖండించింది. మరోపక్క ఆర్జేడీతో పొత్తుపై ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో లాలూ పార్టీ నీతీశ్పై అనుకూల వైఖరిని కనబరుస్తోంది. ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కొద్దికాలంగా సంప్రదింపులు జరుపుతున్నారని, ఆగస్టు 11లోగా సరికొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని నెలకొల్పేలా వీరు ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో మిగిలిన పార్టీలు కూడా అప్రమత్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా వైపు ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
కృష్ణుడి గోపికను నేనే.. హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
Lok Sabha polls: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అబ్బో.. కేసుల్లోనూ ఘనులే
చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి. -
లోకేశ్ తరఫున నామినేషన్ దాఖలు
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు. -
రైతులను అప్పుల్లో ముంచిన జగన్
సీఎం జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటిని కప్పిపుచ్చి ప్రోగ్రెస్ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. -
సీఎం జగన్ అవినీతిపై ఛార్జిషీట్ విడుదల చేస్తాం
ముఖ్యమంత్రి జగన్ అవినీతిపై ఛార్జ్షీట్ రూపొందిస్తామని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
‘నాడు-నేడు’ కార్యశాల పేరిట వైకాపా డప్పు
గ్రామ స్వరాజ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉందని ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి, సీఎం సలహాదారుడు అజేయ కల్లం పేర్కొన్నారు.