Chandrababu: పాఠశాల విద్యార్థుల వరకు గంజాయి వచ్చిందంటే బాధగా ఉంది: చంద్రబాబు

పాఠశాల విద్యార్థుల వరకు గంజాయి వచ్చేసిందంటే బాధగా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిద్వారా పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Updated : 03 Oct 2022 16:26 IST

అమరావతి: పాఠశాల విద్యార్థుల వరకు గంజాయి వచ్చేసిందంటే బాధగా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. గంజాయి సరఫరాను అరికట్టేలా రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులకు పోలీసులను వాడడం ఈ ప్రభుత్వానికి అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను పట్టించుకోకుండా గాలికొదిలేయడం క్షమించరాని నేరమని ఆక్షేపించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని