Jaggareddy: నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు: జగ్గారెడ్డి

కాంగ్రెస్‌ పార్టీని వీడనున్నట్టు ప్రకటించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో జగ్గారెడ్డితో...

Published : 20 Feb 2022 01:38 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీని వీడనున్నట్టు  ప్రకటించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘శుక్రవారం నుంచి జరుగుతున్న పరిణామాల దృష్ట్యా భేటీ జరిగింది. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలతో కొంత మనోవేదన చెందాను. నేను ఒక నిర్ణయం తీసుకున్నా, దానికి కట్టుబడి ఉంటాను. కాంగ్రెస్‌ సీనియర్ నాయకులు నాతో ఫోన్లో మాట్లాడారు. అందరం కూర్చొని మాట్లాడదాం, రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని,తొందరపడొద్దని ఉత్తమ్‌కుమార్‌ కోరారు. మీ అభిప్రాయాలను దిల్లీ వెళ్లి చెప్పాలనీ సలహా ఇచ్చారు. కొద్ది రోజులు మీడియాతో మాట్లాడవద్దన్నారు. ఓ పది రోజులు ఆగమన్నారు.. ఆ తర్వాతా నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. వాయిదా వేసుకున్నా నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. దిల్లీకి వెళ్లి వచ్చాక మళ్లీ ప్రకటన చేస్తాను’’ అని జగ్గారెడ్డి  పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని