Jaggareddy: త్వరలో పార్టీ పదవులకు రాజీనామా.. స్వతంత్రంగా ప్రజా సేవ చేస్తా: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
జీవితంలో కాంగ్రెస్ను విడిచిపోవాలని లేకుండే... కానీ, తాజా పరిస్థితులు తనను అటు వైపుగా ఆలోచన చేసే విధంగా చేస్తున్నాయని ఆ పార్టీ సీనియర్నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే
హైదరాబాద్: జీవితంలో కాంగ్రెస్ను విడిచిపోవాలని లేకుండే... కానీ, తాజా పరిస్థితులు తనను అటు వైపుగా ఆలోచన చేసే విధంగా చేస్తున్నాయని ఆ పార్టీ సీనియర్నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తన పదవులకు రాజీనామా చేసి స్వతంత్రంగా ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నానని ప్రకటించారు. ‘దయచేసి నన్ను ఎవరూ కలవొద్దు.. నా వల్ల పార్టీకి, వ్యక్తిగత రాజకీయ జీవితానికి నష్టమైందనే భావనలో ఉన్న నాయకులు, కార్యకర్తలంతా రాజకీయంగా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని చెప్పారు. ఘన చరిత్ర గల కుటుంబం... సోనియా గాంధీ, రాహుల్గాంధీ అంటే తనకు చాలా ఇష్టం, గౌరవం అని స్పష్టం చేశారు. తాను స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకున్నా సోనియా, రాహుల్ను గౌరవిస్తూనే ఉంటానని... ఈ ప్రకటన విడుదల చేసిన తర్వాత క్షణం నుంచి తాను కాంగ్రెస్ గుంపులో లేనని వెల్లడించారు.
నా వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండొద్దనే ఈ నిర్ణయం..
‘మీడియా దృష్టిలో పడేందుకే మాట్లాడతాననడం సరికాదు. ఏదైనా కోపముంటే నేరుగా చెప్పడం నా వ్యక్తిత్వం. నిర్మోహమాటంగా మాట్లాడతాను కాబట్టే నా మీద మీడియా దృష్టి ఉంటుంది. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగాను. పదవులు ఆశించడం, అందుకోసం ప్రయత్నించడం రాజకీయాల్లో సహజం. కానీ, నామీద కోవర్టు అనే ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోంది. నేను కాంగ్రెస్లో ఉంటే కొందరు ఇబ్బందిగా భావిస్తు్నారు. నా వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశంతో పార్టీ వీడాలనుకున్నా. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లినా .. వేరే పార్టీలో చేరను. సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, వీహెచ్తో పాటు పలువురు నేతలు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని నాకు చెప్పారు. బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చాలా మంది నేతలు చెప్పారు. వారికి నచ్చజెప్పిన తర్వాతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనే ఉద్దేశంతో రెండు..మూడు రోజులు ఆగుతున్నా. లేకపోతే ఇప్పుడే రాజీనామా చేసే వాణ్ని. కాంగ్రెస్ బాగుండాలనే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యా, నేను పార్టీ వీడినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం లేదు’’ అని జగ్గారెడ్డి వివరించారు.
సోనియా, రాహుల్ గాంధీకి లేఖ..
తాజా పరిణామాల నేపథ్యంలో సోనియా, రాహుల్కు జగ్గారెడ్డి లేఖలు రాశారు. తాను ఏ తప్పూ చేయలేదని, సొంత పార్టీలో కుట్రపూరితంగా ప్రణాళికాబద్ధంగా తెరాస కోవర్టు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించే వ్యవస్థ కాంగ్రెస్లో లేకపోవడం దురదృష్టకరమని సోనియా, రాహుల్కు రాసిన సుదీర్ఘ లేఖలో వాపోయారు. వేరే రాజకీయ పార్టీ తనను పిలిస్తే అమ్ముడుపోయాడనే ఒక చరిత్ర ఉంటుందనే వెళ్లలేదని, ఇంత ఆర్థిక కష్టాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కోవర్టు అంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు ప్రచారం చేస్తున్నారని వివరించారు. తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ అమ్ముకోనని, అందుకే ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. హుందాగా బతుకుదాం అనుకున్న కాంగ్రెస్ పార్టీలో తనపై కోవర్టు అనే ప్రచారం జరగడం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి దుష్ర్పచారం చేస్తున్న మూర్ఖులు ఆలోచన చేయాలని హితవుపలికారు. వేరే పార్టీలోకి వెళ్లాలనుకుంటే నేరుగా వెళతా కదా? ఇక్కడే ఉండి కోవర్టు అని ప్రచారం చేయించుకునే కర్మ తనకెందుకని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని చెబితే అప్పుడు నన్ను తెలంగాణ ద్రోహి అన్నారు.. కానీ, ఇప్పుడు అయ్యో జగ్గారెడ్డి చెప్పింది నిజమే కదా! రాజకీయంగా దెబ్బతిన్నామనే భావనలో ఉన్నారని చెప్పారు. ఈ పనికి మాలిన నిందలతో ఆవేదన చెందడం కంటే మనస్సాక్షికి కట్టుబడి స్వతంత్రంగా రాజకీయ జీవితం గడపడం మేలని నిర్ణయం తీసుకున్నట్టు జగ్గారెడ్డి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
గుంటూరు జిల్లా పొన్నూరు వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. -
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
దక్షిణాదిలో భాజపా ఈసారి అత్యుత్తమ పనితీరు కనబరుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తంచేశారు. -
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం, రాజంపేట భాజపా అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. -
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
ఇటీవల తన తల్లి మృతి నేపథ్యంలో హమీర్పుర్ సీటు తనకు ఇచ్చినా పోటీ చేసే ఉద్దేశం లేదని డిప్యూటీ సీఎం కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి అన్నారు. -
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా నడుస్తోందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. -
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
మహారాష్ట్రలోని బారామతిలో ఉత్కంఠ పోరు నెలకొంది. పవార్ కుటుంబంలోని ఇద్దరు మహిళలు పరస్పరం తలపడటం ఉత్కంఠ రేపుతోంది. -
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్డీఏ కూటమి నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. -
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
తెలుగుదేశం అభ్యర్థులకు అధినేత చంద్రబాబు ఈనెల 21న బీఫామ్లు అందజేయనున్నారు. -
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా నారా లోకేశ్ నామినేషన్ దాఖలు చేశారు. -
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
రాష్ట్రానికి ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
భీమిలి, జీడీ నెల్లూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైకాపా నేతలు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. -
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. -
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
వైఎస్ఆర్ హయంలో హంద్రీనీవా ప్రాజెక్టు 90 శాతం పూర్తి అయిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అధికారంలోకి వస్తే ప్రాజెక్టు పూర్తి చేసి -
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
మాజీ మంత్రి వివేకానందరెడ్డి 40 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేశారని ఆయన కుమార్తె సునీత అన్నారు. వివేకాను అత్యంత దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. -
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీకి చెందిన గూండాలు అరాచకం సృష్టించారు. -
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
కాంగ్రెస్కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాల్లో భాజపా (BJP) విజయం సాధించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) అన్నారు. -
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. -
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ తెదేపా అభ్యర్థి బొండా ఉమాను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు.
తాజా వార్తలు (Latest News)
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు