Telangana News: సైలెంట్‌గా ఉన్న చంద్రబాబుకు ఆ అవకాశం ఇచ్చింది కేసీఆరే: జగ్గారెడ్డి

సైలెంట్‌గా ఉన్న తెదేపా అధినేత చంద్రబాబును తెలంగాణకు వచ్చేలా చేసింది సీఎం కేసీఆర్‌ అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.  సీఎం కేసీఆర్‌ మనసులో ఎక్కడో ఇంకా సమైక్య భావన ఉందన్నారు.

Published : 26 Dec 2022 15:02 IST

హైదరాబాద్‌: పార్టీ పేరు మార్పు చేసి సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను అవమానించారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్‌ ఏపీకి వెళ్తున్నారు కాబట్టే తెదేపా అధినేత చంద్రబాబు తెలంగాణకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సీఎల్పీ కార్యాలయంలో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సైలెంట్‌గా ఉన్న చంద్రబాబును రాష్ట్రానికి వచ్చేలా కేసీఆర్ అవకాశం ఇచ్చారన్నారు. ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ ప్రభావం చూపించలేరు కానీ, తెలంగాణలో చంద్రబాబు ప్రభావం చూపించగలరని అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘‘పార్టీ పేరు నుంచి తెలంగాణను తీసేయడంతో తెలంగాణ వాదాన్ని చంపేయడమే కాకుండా తన బలాన్ని కేసీఆర్ కోల్పోయారు. సీఎం కేసీఆర్‌ మనసులో ఎక్కడో ఇంకా సమైక్య భావన ఉంది. రాజకీయ బతుకునిచ్చిన చెట్టునే ఆయన నరికేశారు. కూటములు, పొత్తులపై భవిష్యత్తులో తెలుస్తుంది. ఇకపై  రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. మహారాష్ట్ర, కర్ణాటకకు బీఆర్ఎస్ వెళ్తే.. తెదేపా కూడా వెళ్తుంది. బీఆర్‌ఎస్‌తో కేసీఆర్ విజయం సాధించే పరిస్థితి లేదు’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని