Telangana News: సైలెంట్గా ఉన్న చంద్రబాబుకు ఆ అవకాశం ఇచ్చింది కేసీఆరే: జగ్గారెడ్డి
సైలెంట్గా ఉన్న తెదేపా అధినేత చంద్రబాబును తెలంగాణకు వచ్చేలా చేసింది సీఎం కేసీఆర్ అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ మనసులో ఎక్కడో ఇంకా సమైక్య భావన ఉందన్నారు.
హైదరాబాద్: పార్టీ పేరు మార్పు చేసి సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను అవమానించారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ ఏపీకి వెళ్తున్నారు కాబట్టే తెదేపా అధినేత చంద్రబాబు తెలంగాణకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సీఎల్పీ కార్యాలయంలో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సైలెంట్గా ఉన్న చంద్రబాబును రాష్ట్రానికి వచ్చేలా కేసీఆర్ అవకాశం ఇచ్చారన్నారు. ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ ప్రభావం చూపించలేరు కానీ, తెలంగాణలో చంద్రబాబు ప్రభావం చూపించగలరని అభిప్రాయం వ్యక్తం చేశారు.
‘‘పార్టీ పేరు నుంచి తెలంగాణను తీసేయడంతో తెలంగాణ వాదాన్ని చంపేయడమే కాకుండా తన బలాన్ని కేసీఆర్ కోల్పోయారు. సీఎం కేసీఆర్ మనసులో ఎక్కడో ఇంకా సమైక్య భావన ఉంది. రాజకీయ బతుకునిచ్చిన చెట్టునే ఆయన నరికేశారు. కూటములు, పొత్తులపై భవిష్యత్తులో తెలుస్తుంది. ఇకపై రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. మహారాష్ట్ర, కర్ణాటకకు బీఆర్ఎస్ వెళ్తే.. తెదేపా కూడా వెళ్తుంది. బీఆర్ఎస్తో కేసీఆర్ విజయం సాధించే పరిస్థితి లేదు’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.