రైతుల కోసం ఎంతవరకైనా పోరాటం: పవన్

రాష్ట్రంలో రైతులకు న్యాయం జరిగేందుకు ఎంత వరకైనా పోరాటం చేస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లాలో నివర్‌ తుపాను ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన పవన్‌..

Updated : 29 Dec 2020 13:10 IST

మచిలీపట్నం : రాష్ట్రంలో రైతులకు న్యాయం జరిగేందుకు ఎంత వరకైనా పోరాటం చేస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లాలో నివర్‌ తుపాను ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన పవన్‌.. రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. కంకిపాడు మీదుగా గుడివాడ చేరుకున్న పవన్‌ అక్కడ నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. గుడివాడకు వచ్చే రహదారులు అధ్వానంగా ఉన్నాయని.. కొత్త రోడ్లు నిర్మించాలంటూ స్థానిక నేతలను నిలదీయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. 

వైకాపా నేతలకు పేకాట క్లబ్బులు నిర్వహించడంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని విమర్శించారు. ప్రజా ప్రతినిధులెవరైనా బాధ్యతగా వ్యవహరించకపోతే వారిని రోడ్డు మీదకు తీసుకొచ్చే సత్తా ప్రజలకు ఉందన్నారు. ప్రజలను భయపెట్టి పాలిస్తామంటే సహించడానికి ఎవరూ సిద్ధంగా లేరని చెప్పారు. మార్పు రావాలి.. అందరికీ న్యాయం జరగాలని పవన్‌ ఆకాంక్షించారు. దాష్టీకం చేసే ఏ ప్రజాప్రతినిధినైనా జనసేన చాలా బలంగా ఎదుర్కొంటుందని ఆయన చెప్పారు.

ఇవీ చదవండి..
చెప్పిన దానికంటే ఎక్కువగానే..: సీఎం జగన్‌

కొవిడ్‌ టీకా డ్రైరన్‌ విజయవంతం
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని