Pawan Kalyan: వైకాపాకు, జనసేనకు ఉన్న తేడా అదే..: పవన్
ఆంధ్రప్రదేశ్కు వైకాపా హానికరమని జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan) అన్నారు. ఏ ఒక్కరి వల్లో రాష్ట్రం బాగుపడుతుందని తాను......
విజయవాడ: ఆంధ్రప్రదేశ్కు వైకాపా హానికరమని జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan) అన్నారు. ఏ ఒక్కరి వల్లో రాష్ట్రం బాగుపడుతుందని తాను అనుకోవడంలేదని.. చిత్తశుద్ధితో కూడిన కార్యకర్తలు ప్రతి గ్రామంలో పట్టుమని పది మంది ఉండి.. రాష్ట్రానికి బలమైన నేతల సమూహం ఉంటే తప్ప సమస్యల వలయం నుంచి బయటకు తీసుకురాలేమన్నారు. ఆ బాధ్యతను జనసేన తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాన్ని వైకాపా రాక్షస పాలన నుంచి బయటపడేయొచ్చన్నారు. జనవాణి కార్యక్రమం అనంతరం విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
నా నుంచి అద్భుతాలు ఆశించొద్దు
రాష్ట్రంలో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని.. యువతకు ఉపాధి, ఉద్యోగాల్లేవని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలకు ఓపిక లేదని.. కానీ పండుగలు, పుట్టినరోజులు.. రకరకాల సంబరాలకు మాత్రం వారికి సమయం ఉంటుందని విమర్శించారు. ప్రెస్మీట్లు పెట్టి బూతులు తిట్టడానికీ వారికి టైం దొరుకుతుంది గాని.. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎందుకు సమయం ఉండటంలేదని పవన్ ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వారు సమయం కేటాయించేలా సమాజం నుంచి ఒత్తిడి రాకపోతే మార్పు రావడం కష్టమని వ్యాఖ్యానించారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్యాయం జరిగిన సగటు మనిషి పక్షాన నిలబడాలన్న ఉద్దేశంతోనే జనవాణి కార్యక్రమం ప్రారంభించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమం సందర్భంగా రైతులకు గిట్టుబాటు, కౌలు రైతుల సమస్యలతో పాటు టిడ్కో ఇళ్లు, విద్యార్థుల ఫీజు రీయింబర్సుమెంట్, విదేశీ విద్యా పథకం సహా అనేక అంశాలపై ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయన్నారు. ప్రభుత్వం చేపడుతున్న స్పందన కార్యక్రమం విజయవంతమైతే ఈరోజు ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వస్తాయని పవన్ ప్రశ్నించారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించే శక్తి తనకు లేకపోయినా వాటిని ఎక్కువ మంది దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయగలనన్నారు.
‘‘నా నుంచి అద్భుతాలు ఆశించొద్దు.. నేను సీఎంని కాదు. నేను సగటు మనిషిని. ప్రజల సమస్యల్ని పది మంది దృష్టికి తీసుకెళ్లగలను. మీ సమస్యలను సంబంధిత శాఖలకు చేరవేసి ఒత్తిడి తేగలం. మీ గ్రామాల్లో/ మండలాల్లో ఉన్న చిన్నపాటి సమస్యలైనా మా దృష్టికి వస్తే.. మరికొందరికి తెలిసేందుకు అవకాశం ఉంటుంది. ఉద్దానం సమస్య ఎక్కడో మారుమూలగా ఉండేది.. మేం మాట్లాడాక ప్రపంచ సమస్యగా మారింది. ఓ వ్యక్తిగా నేను చేయగలిగేది ఎక్కువమంది దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేయగలగడమే. నాయకుడికి హృదయం ఉండాలి. మనుషులతో మాట్లాడాలి. సమస్యలకు పరిష్కారం వెంటనే రాదు. పదిమందితో మాట్లాడే కొద్దీ పరిష్కారం వస్తుంది‘‘ అని పవన్ అన్నారు.
వైకాపాకు, మాకూ ఉన్న తేడా అదే..!
‘‘వెనుజులా, శ్రీలంక లాంటి దేశాల్లో వనరులు ఉన్నప్పటికీ సరైన నాయకత్వం లేకపోవడంతో విఫలమయ్యాయి. ఏపీకి వనరులు తక్కువ. దోచేయడానికి మాత్రం రూ.లక్షల కోట్లు దొరుకుతున్నాయి. సమర్థ నాయకత్వం లేకపోవడం వల్లే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి? జనాన్ని ఎలా మభ్యపెట్టాలి? ప్రత్యర్థి పార్టీలను ఎలా ఇబ్బంది పెట్టాలి? ఎలా కేసులు పెట్టాలనే దానిపై వారికి సమర్థత ఉంది. కానీ, ప్రజల సమస్య పరిష్కారించడం మాత్రం ఇష్టం ఉండదు. వైకాపాకు జనసేనకు ఒకటే తేడా. ఫలానా పనిచేస్తే మాకు ఇన్ని ఓట్లు వస్తాయని వారు లెక్కలు వేసుకుంటారు. ఈ పనిచేస్తే వాళ్ల జీవితం ఎంతో బాగుపడుతుందని మేం అనుకుంటాం. అంతే తేడా. ప్రజలు మనకు ఓట్లు వేస్తారా? లేదా? అనుకొనే కంటే మనం వారితో ఉన్నామనే భరోసా ఇవ్వగలిగితేనే ఓట్లు అడిగే హక్కు మనకు ఉంటుంది. ఎన్నికల నాటికి ఎంత మంది నిలబడతారో తెలియదు గానీ.. ప్రజల కోసం జనసేన నిలబడుతుంది. బాధ్యతతో పనిచేస్తాం. తప్పు చేసినోడి తోలు తీసేలా శాంతిభద్రతలను అమలుచేస్తాం’’ అని పవన్ అన్నారు.
మోదీకి స్వాగతం..
‘‘ఆజాదీ అమృత్ మహోత్సవాల సందర్భంగా భీమవరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వస్తున్న ప్రధాని మోదీకి జనసేన, జనసైనికుల పట్ల స్వాగతం పలుకుతున్నాం. మనందరి గుండెల్లో స్ఫూర్తిని నింపిన అల్లూరి విగ్రహావిష్కరణకు రావడం సంతోషదాయకం. భీమవరం నుంచి పోటీ చేసిన వ్యక్తిగా ప్రత్యేకించి నాకిది ఆనందదాయకం. ఆజాదీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి నాకు కూడా ప్రత్యేకించి ఆహ్వానం పంపినందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు. 4వ తేదీన జరిగే సభలో జనసేన కూడా ప్రాతినిధ్యం వహించాలని మా నేతలందరినీ కోరాను. సంపూర్ణ మద్దతు ఇవ్వాలని శ్రేణులకు విజ్ఞప్తి చేశాను’’ అని పేర్కొంటూ పవన్ కల్యాణ్ ఓ వీడియోని విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు వైకాపా నేతలపై పోలీసులు సోమవారం కేసులు నమోదు చేశారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ
ప్రజలతో మమేకమయ్యేందుకు తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ ఆ పార్టీ అభ్యర్థి లోకేశ్ సోమవారం ‘రచ్చబండ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ప్రధాని సభలో ఇంత భద్రతా వైఫల్యమా?
‘ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్న ప్రజాగళం బహిరంగ సభలో అడుగడుగునా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. సభలో ఎక్కడా ప్రజలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. -
జనం తోసుకుంటుంటే చోద్యం చూశారు
ప్రధాని మోదీ పాల్గొన్న బొప్పూడి ప్రజాగళం సభకు భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ధ్వజమెత్తారు. -
ప్రభుత్వ వెబ్సైట్లలో ఫొటోలు తొలగించాలి
ప్రభుత్వశాఖల వెబ్సైట్లలో ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఉండడంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)కి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. -
ప్రధాని సభకు ఆటంకాల వెనుక జగన్ హస్తం
ప్రధానమంత్రి పాల్గొన్న ప్రజాగళం సభకు ఆటంకాలు సృష్టించడం వెనుక ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందని మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. -
లక్షల మంది తరలివచ్చి కూటమిని ఆశీర్వదించారు
చిలకలూరిపేటలో భాజపా, తెదేపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వంటిది ఈ దశాబ్దంలో చూడలేదని జనం చెబుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపు చేపడితే మేలు
ఏపీలో మే 13న ఎన్నికలు ముగిశాక సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపును చేపట్టాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. -
జగన్ అరాచక పాలనకు మోదీ అండ: సీపీఐ
వైఎస్ వివేకా హత్య కేసు నిందితులను సీబీఐ ఇంతవరకు గుర్తించకపోవడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. -
కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్ యథావిధిగా జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. -
వైకాపా అధిష్ఠానానికి నగరి అసమ్మతి నేతల ఝలక్
చిత్తూరు జిల్లా నగరి సీటును మంత్రి రోజాకు కేటాయిస్తే తాము పని చేయమని వైకాపా అసమ్మతి నేతలు తెగేసి చెప్పినా, రెండ్రోజుల క్రితం ఆమె అభ్యర్థిత్వాన్నే జగన్ ఖరారు చేశారు. -
కడపలోనూ కొండలు కొల్లగొట్టేశారు...
ముఖ్యమంత్రి జగన్ సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో కొండలు, గుట్టలను వైకాపా నేతలు అయిదేళ్లుగా వరుసబెట్టి మింగేశారు. -
హిందూమతం అంతమే వారి లక్ష్యం
దేశంలో హిందూమతాన్ని, శక్తి ఆరాధనను అంతం చేసేందుకు ఇండియా కూటమి కంకణం కట్టుకుందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. -
ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి సవాంగ్ రాజీనామా చేయాలి
గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం మూడుసార్లు చేస్తే ఒక్కసారే జరిగిందంటూ ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్సవాంగ్ బుకాయించడం సిగ్గుచేటని, ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని.. తక్షణం రాజీనామా చేయాలని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. -
ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేని అసమర్థ సీఎం జగన్
జగన్రెడ్డి అయిదేళ్ల పాలనలో జలవనరుల రంగంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా రైతులకు కన్నీరు మిగిల్చారని జలవనరుల శాఖ మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. -
గెలుపే లక్ష్యంగా పని చేయాలి
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెదేపా, భాజపా అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పిలుపునిచ్చారు. -
ప్రజాగళం విజయవంతంతోసర్దుకుంటున్న జగన్ సర్కారు
చిలకలూరిపేటలో ఎన్డీఏ సభ (ప్రజాగళం) విజయవంతం కావడంతో జగన్ ప్రభుత్వం తట్టాబుట్టా సర్దుకునే పనిలో నిమగ్నమైందని భాజపా అధికార ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
వైకాపాలో చేరిన తెదేపా నేత రామచంద్రరావు
విశాఖపట్నానికి చెందిన తెదేపా నేత గంపల వెంకట రామచంద్రరావు, ఆయన భార్య సంధ్యారాణి వైకాపాలో చేరారు. సోమవారం వారు తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు. -
ఆయన మా అమ్మకు ఫోన్ చేసి ఏడ్చేశారు
ఇటీవల భాజపాలో చేరిన సీనియర్ నేత అశోక్ చవాన్ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మహారాష్ట్రకు చెందిన ఒక సీనియర్ నేత కాంగ్రెస్ను వీడారు. ఆయన మా అమ్మతో మాట్లాడుతూ..‘సోనియాజీ.. వారితో పోరాడే శక్తి నాకు లేదు. -
ఖమ్మం, మెదక్, భువనగిరి టికెట్లకు పోటాపోటీ
రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ ఏకాభిప్రాయ దిశగా సాగుతోంది. నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు మొదటి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించించగా మిగిలిన 13 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. -
ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు
‘‘ప్రజాజీవితంలో ఓడినా, గెలిచినా ఒక్కతీరుగా ఉండాలి. మన ప్రజలు.. మన రాష్ట్రం అనే పద్ధతిలోనే ముందుకు సాగాలి’’ అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి అటు ఓటేశారని... ఇప్పుడు ప్రజలకు వాస్తవం అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు