Andhra News: పవన్ను దూషిస్తేనే మంత్రుల ఫైళ్లపై సంతకాలా?: జనసేన నేత కిరణ్ రాయల్
సీఎం జగన్ సహా మంత్రులంతా సీబీఐ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ దత్తపుత్రులని జనసేన నేత కిరణ్ రాయల్ ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్పై పలువురు మంత్రులు ఆరోపణలు
తిరుపతి: సీఎం జగన్ సహా మంత్రులంతా సీబీఐ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ దత్తపుత్రులని జనసేన నేత కిరణ్ రాయల్ ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్పై పలువురు మంత్రులు ఆరోపణలు చేసిన నేపథ్యంలో తిరుపతిలో జనసేన నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ జగన్ కేబినెట్లో ఉన్నవారు మంత్రులా? కంత్రులా అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో మరోసారి తీవ్ర పదజాలం వాడితే వారికంటే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని కిరణ్ హెచ్చరించారు. తమ స్పందన ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. పవన్ను దూషిస్తేనే మంత్రుల ఫైళ్లపై సీఎం సంతకం చేస్తున్నారా? అని కిరణ్ రాయల్ నిలదీశారు. ఈ సందర్భంగా ‘రాష్ట్రానికి కొత్తగా వచ్చిన విష సర్పాలు’ పేరుతో ఉన్న పోస్టర్ను జనసేన నేతలు ఆవిష్కరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
India-Pakistan: సింధు జలాల ఒప్పందాన్ని మార్చుకుందాం.. పాక్కు భారత్ నోటీసు
-
Politics News
Yuvagalam: యువగళం పాదయాత్ర.. సొమ్మసిల్లిన సినీనటుడు తారకరత్న
-
Sports News
Axar Patel : ప్రియురాలిని వివాహమాడిన ఆల్రౌండర్ అక్షర్ పటేల్..
-
India News
Pariksha Pe Charcha: విద్యార్థులతో ప్రధాని మోదీ ‘పరీక్షాపే చర్చ’
-
Movies News
Srinivasa Murthy: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూత
-
World News
Elon Musk: కాలేజ్కు వెళ్లేది చదువుకోవడానికి కాదట..!