జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం: జనసేన
ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన వైకాపా.. అధికారంలోకి వచ్చాక మడమ తిప్పిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. జాబ్ క్యాలెండర్లో కేవలం 10,143 ఉద్యోగాలనే భర్తీ..
అమరావతి: ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన వైకాపా.. అధికారంలోకి వచ్చాక మడమ తిప్పిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. జాబ్ క్యాలెండర్లో కేవలం 10,143 ఉద్యోగాలనే భర్తీ చేస్తామని ప్రకటించడం ద్వారా రెండేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పిన వైకాపా.. చివరికి గ్రూప్-1, గ్రూప్-2 విభాగాల్లో కేవలం 36 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు చూపించిందని మండిపడ్డారు. ప్రకటన లక్షల్లో ఉండి.. భర్తీ మాత్రం నామమాత్రంగా ఉందని ఆక్షేపించారు. రాష్ట్రవ్యాప్తంగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్టుగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు.
‘‘రాష్ట్రంలో 2.59 లక్షల గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలను భర్తీ చేశామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ఇదే వాలంటీర్లు జీతాలు పెంచాలని ఆందోళనకు సిద్ధమైతే.. మీవి ఉద్యోగాలు కావు.. స్వచ్ఛంద సేవ మాత్రమే అని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రచారం కోసం మాత్రం వాళ్లవి ఉద్యోగాలు అని చెబుతున్నారు. ఆర్టీసీలో 51 వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆ సంస్థ ప్రభుత్వంలో విలీనం అయ్యేనాటికి ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా కొత్తగా నియమించినట్లు చెప్పడం విచిత్రంగా ఉంది. తప్పుడు ప్రకటన ద్వారా వైకాపా ప్రభుత్వం ఎవరిని మోసం చేయాలని చూస్తోంది’’ అని నిలదీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్