Pawan kalyan: కష్టాల్లో ఉన్నవారంతా నా సొంతవాళ్లే.. నేనెవరికీ దత్తతగా వెళ్లను: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులను ఆదుకునేవారు లేకుండా పోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
చింతలపూడి: ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులను ఆదుకునేవారు లేకుండా పోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం గుర్తించాలని.. వారికి అండగా ఉండాలని పవన్ డిమాండ్ చేశారు. కౌలు రైతులు అధిక వడ్డీకి అప్పు తీసుకుంటున్నారని.. ఆ అప్పు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 80 శాతం మంది కౌలు రైతులే ఉన్నారని.. ఇప్పటివరకు 3 వేలకుపైగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
నేను ఒక్కొక్క మెట్టు ఎక్కాలనుకునేవాడిని...
‘‘కౌలు రైతుల సమస్యలను వైకాపా ప్రభుత్వం సృష్టించిందని నేను చెప్పడం లేదు. కౌలు రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం వల్లే ఈ సమస్యను నేను బయటకు తీసుకొచ్చాను. నిజంగా వైకాపా ఇవాళ కౌలు రైతులకు అండగా ఉంటే నేను రోడ్డు మీదకు రావాల్సిన అవసరం వచ్చేది కాదు. ఈ సభకు పెద్ద ఎత్తున యువత హాజరయ్యారు. మీలో చాలా మంది వైకాపాకు ఓటేశారు. నాపై వ్యక్తిగత ఇష్టం ఉన్నప్పటికీ రాజకీయంగా జగన్కు ఓటేశారు. నేను స్వాగతిస్తాను. నేను ఒక్కొక్క మెట్టు ఎక్కాలనుకునేవాడిని. రాత్రికి రాత్రి ఎక్కడికో వెళ్లాలనుకోను. ఇంత బలమైన మెజారిటీ ఇచ్చిన ప్రజల కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. రైతు ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానం.. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ కొంత మంది వైకాపా కార్యకర్తలు ఉండే ఉంటారు. వైకాపా అంటే నాకు ఎలాంటి ద్వేషం లేదు. ప్రజల కన్నీళ్లు తుడవకపోతే గ్రామాల్లో ఎందుకండి గ్రామ సచివాలయాలు? జనసేన ఎత్తుకుంటే తప్ప మీకు సమస్య గుర్తుకురాలేదా? ప్రజల కన్నీళ్లు తుడుస్తామని చెప్పిన జగన్ అలా చేయకపోతే మాత్రం గట్టిగా అడుగుతాం’’
ఇంకోసారి దత్తపుత్రుడు అంటే..
రైతుల సమస్యలను ఎత్తుకుంటే మీ నాయకుడు మమ్మల్ని దత్తపుత్రుడు అని అంటాడు. ఎవరెన్నిసార్లు అలా అన్నా మర్యాదగా మాట్లాడాను. ఇంకొకసారి నన్ను దత్తపుత్రుడు అని అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఇలాగే కొనసాగితే సీబీఐ దత్తపుత్రుడు అని అనాల్సి వస్తుంది. నేను ప్రజల కష్టాలు, ప్రభుత్వ విధానాలపై మాట్లాడుతున్నా. వ్యక్తిగతంగా ఎవరినీ దూషించను. కానీ నన్ను మాత్రం చాలా నీచంగా దూషిస్తున్నారు. కౌలు రైతుల సమస్యలు నేను సృష్టించినవి కాదు. ఒకసారి వచ్చి ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబసభ్యులతో మాట్లాడండి. అసలు సమస్య ఏంటో తెలుస్తది. అధికారం మీ చేతుల్లో ఉంది. మీరే పట్టించుకోకపోతే ఎలా?ఇప్పటికీ ముఖ్యమంత్రి స్థానానికి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను. ఇంకోసారి దత్తపుత్రుడు అంటే సీబీఐకి దత్తపుత్రుడు అనే మాటను ఫిక్స్ అవుతాం. కష్టాల్లో ఉన్నవారంతా నా సొంతవాళ్లే.. నేనేవరికి దత్తతగా వెళ్లను. అనంతపురం సభ తర్వాత నర్సాపురం ఎంపీ నాకు కొన్ని సూచనలు చేశారు. మీరు సరిగ్గా కొన్ని వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అని అన్నారు. సరిదిద్దుకోవాలని చెప్పారు. వారి సూచన మేరకు నేను సరిదిద్దకుంటాను. పోయినసారి చర్లపల్లి షటిల్ టీం అని అన్నాను. అది చర్లపల్లి కాదు.. చంచల్గూడ షటిల్ టీం అని చెప్పారు. చంచల్గూడలో షటిల్ ఆడుతూ మీరు నాకు చెబుతున్నారా? కష్టాల్లో ఉన్నవారంతా నా సొంతవాళ్లే.. నేనేవరికి దత్తతగా వెళ్లను. నన్ను దత్తత తీసుకుంటే ఎవరూ భరించలేరు’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
జనసైనికులపై చేయి పడితే..
సీఎం రిలీఫ్ ఫండ్ ఏం చేస్తోంది? ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు ఉపయోగించుకోవచ్చు కదా. ఎవరో వచ్చి ఏదో చేస్తారని మోసపోయేవాడిని కాదు నేను. నేను ఏం చేయగలనో అదే చేస్తున్నాను. అందుకే ప్రత్యేక నిధి పెట్టుకున్నాను. జనసైనికుల మీద పోలీసులు, వైకాపా గూండాలతో దాడి చేయించారు. వైకాపా నాయకులకు చెప్తున్నాను. నేను ఎంత మేర సహనం పాటిస్తానో నాకు తెలుసు. ఇక అవడం లేదనుకుంటే మాత్రం ఎలా అర్థమయ్యేలా చేప్పాలో కూడా నాకు బాగా తెలుసు. జనసైనికులపై చేయి పడితే మాత్రం సహించేది లేదు. గీతా సారాంశాన్ని నమ్మే వ్యక్తిని నేను. కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తాను. ప్రజలు ముఖ్యమంత్రి పదవి ఇస్తే చేసుకుంటూ పోతాను.. లేకున్నా ప్రజలకు దాసుడిగానే ఉంటాను. అధికారం వస్తే ఏం చేస్తానో చెప్పడం లేదు.. నాకున్నదాంట్లో ఎంత చేయగలనో చేస్తున్నాను. వైకాపా పాలన ఘోరంగా సాగుతోంది. దీన్ని మార్చే శక్తి కేవలం యువతకు మాత్రమే ఉంది. మీరు బాధ్యత తీసుకోకపోతే ఈ సమాజంలో మార్పు రాదు. కళ్లముందు తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా నిలబడ్డా. ఓటమే గెలుపునకు పునాదని నమ్ముతా.. అందుకే నిలబడి ప్రజల కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్నాను.’’ అని పవన్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. సీపీఎం మద్దతు కోరింది. -
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
ఒక్క డీఎస్సీ కూడా పెట్టకుండా జగన్.. యువత భవిష్యత్తు నాశనం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. -
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, రాహుల్గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. -
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!