Bihar: భాజపాతో నీతీశ్ బ్రేకప్ వార్తలు: బిహార్లో నేతలు బిజీబిజీ..!
బిహార్లో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. భాజపాకు జేడీయూ బ్రేకప్ చెప్తుందన్న వార్తల నేపథ్యంలో.. అధికార, ప్రతిపక్ష పార్టీలు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
ఫోన్లకు నో ఎంట్రీ
పట్నా: బిహార్లో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. భాజపాకు జేడీయూ బ్రేకప్ చెప్తుందన్న వార్తల నేపథ్యంలో.. అధికార, ప్రతిపక్ష పార్టీలు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అన్నిపార్టీల నేతలు బిజీబిజీగా గడుపుతున్నారు. అటు జేడీయూ నేతలు ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ అధికారిక నివాసానికి రాగా, ఇటు ఆర్జేడీ నేతలు, ఇతర విపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి లాలూ సతీమణి రబ్రీదేవీ ఇంటికి వచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
‘గతంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో మా పార్టీ ఇలాంటి సమావేశాలు నిర్వహించింది. పార్టీ సంస్థాగత మార్పుల నిమిత్తం ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. ఎన్డీఏలో సంక్షోభం గురించి నేను ఎప్పడూ వినలేదు’ అని జేడీయూ నేత రామ్నాథ్ ఠాకూర్ వెల్లడించారు. తనకైతే ఈ సంక్షోభం గురించి తెలీదని, కానీ నీతీశ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి సన్నిహిత నేత ఒకరు వెల్లడించారు. ఎమ్మెల్యే వినయ్ చౌధరీ మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. ‘నీతీశ్ కుమార్ను భాజపా వేధించింది. జేడీయూను బలహీనం చేసే కుట్ర జరిగింది. అది పార్టీకి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మేం నీతీశ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఆర్జేడీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం వస్తే.. మాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ నీతీశే సీఎంగా కొనసాగుతారు’ అని పేర్కొన్నారు.
ఇటుపక్క ఆర్జేడీ నేతలు రబ్రీదేవీకి చెందిన సర్క్యులర్ రోడ్ బంగ్లాలో సమావేశమయ్యారు. లాలూ తనయుడు తేజస్వీ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతేగాకుండా కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, మహాగట్బంధన్కు చెందిన ప్రతిపక్ష నేతలు వీరితో కలిసొచ్చారు. కాగా, ఈ సమావేశాలకు ఎవరూ ఫోన్ తీసుకురావొద్దని ముందుగానే ఆదేశాలు అందడం గమనార్హం. ‘రెండేళ్లుగా ఈ పుకార్లు వినిపిస్తున్నాయి. నేతలు ఎవరూ ఆవేశపూరిత అంచనాలు పెట్టుకోవద్దు. ఒకసారి పార్టీ అధిష్ఠానం ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. అది అందరికీ తెలిసిపోతుంది’ అని ఆర్జేడీ నేత ఒకరు వెల్లడించారు. మరోపక్క ఇదే విషయమై బిహార్కు చెందిన భాజపా నేతలకు దిల్లీ నుంచి పిలుపువచ్చింది.
గతంలో ఆర్జేడీ, కాంగ్రెస్లతో కలిసి జట్టు కట్టి బిహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నీతీశ్ కుమార్ కొంత కాలానికి బయటకు వచ్చి భాజపాతో చేతులుకలిపారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపా, జేడీ(యు) కలిసి పోటీ చేశాయి. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ 75 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆధిక్యం సాధించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో జేడీయూ తక్కువ స్థానాలే వచ్చినప్పటికీ మిత్ర ధర్మాన్ని పాటిస్తూ భాజపా నీతీశ్కే ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది. అయితే, కొంతకాలంగా భాజపా, జేడీయూ మధ్య దూరం పెరుగుతోందని వార్తలు వస్తున్నాయి. వాటికి ఆజ్యం పోసేలా.. ఇటీవల ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అధ్యక్షత వహించిన పలు సమావేశాలకు నీతీశ్ గైర్హాజరయ్యారు. ఇంకోపక్క మాజీ కేంద్రమంత్రి ఆర్సీపీ సింగ్(మాజీ జేడీయూ నేత)తో కలిసి జేడీయూను చీల్చేందుకు భాజపా కుట్రచేస్తోందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
కాకినాడ జిల్లా కొత్తపల్లిలో తెదేపా నేతలు, కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా సీనియర్ నేత కనకమేడల రవీంద్ర మరో లేఖ రాశారు. సీఎంపై రాయి దాడి కేసులో బొండా ఉమాను ఇరికించేలా వ్యవహరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. -
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని తెదేపా నేత బొండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
సమయానికి ‘108’ రాకే రాజాంలో బాలుడి మృతి
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
జగన్పై రాయి దాడి కేసులో సెక్షన్ 307 వర్తించదు
సీఎం జగన్పై హత్యాయత్నమే జరగనప్పుడు నిందితుల మీద 307 సెక్షన్ ఎలా బనాయిస్తారని తెదేపా నేతలు ప్రశ్నించారు. చిన్న రాయితో హత్యాయత్నానికి ప్రయత్నించాడని ఓ అమాయకుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా అరెస్టు చేశారని ఆరోపించారు. -
షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసు
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆమె వివేకా హత్యను ప్రస్తావించి వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు అవినాష్రెడ్డి, మల్లాది విష్ణు, వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. -
రాయి దాడి హత్యాయత్నం కాదు.. జగన్ నాటకం: వర్ల రామయ్య
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి హత్యాయత్నం కాదని..ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయడం లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలి
జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఉద్దేశించి ఈ నెల 16న భీమవరం సభలో సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనాకు ఆ పార్టీ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. -
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు. -
అభ్యర్థుల ఆస్తులు.. అప్పులు.. కేసులు..
లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డిపై కేసు
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డిపై ఆదిభట్ల పోలీస్స్టేషన్లో భూకబ్జా కేసు నమోదైంది. -
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు: జగ్గారెడ్డి
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు, గ్రాఫిక్ లీడర్స్ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?