UP politics: యోగి-జితిన్ తొలిసారి భేటీ
కాంగ్రెస్కు స్వస్తి చెప్పి భాజపా తీర్థం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద తొలిసారిగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు..
దిల్లీ: కాంగ్రెస్కు స్వస్తి చెప్పి భాజపా తీర్థం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద తొలిసారిగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వివిధ సంక్షేమ పథకాలపై యోగితో చర్చించినట్లు ఆయన చెప్పారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోం మంత్రి అమిత్షా మార్గనిర్దేశంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే భాజపాలో చేరాను. పార్టీలో చేరిన తర్వాత రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. అందువల్ల మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలిశాను’’ అని ఆయన మీడియాకు వివరించారు. భవిష్యత్లో రాష్ట్రంలో తీసుకురావాల్సిన సంక్షేమ పథకాలు, పార్టీ నాయకత్వాన్ని ఎలా బలోపేతం చేయాలన్న దానిపై చర్చించినట్లు భేటీ అనంతరం జితిన్ ప్రసాద వివరించారు.
ఈ నెల 9న దిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో జితిన్ ప్రసాద భాజపాలోకి చేరారు. కాంగ్రెస్తో మూడు తరాల అనుబంధం ఉన్నప్పటికీ ప్రజల ప్రయోజనాల కోసం, ప్రజల కోసం నిలబడే పార్టీలో చేరానని ఆయన అన్నారు. 47 ఏళ్ల జితిన్ ప్రసాద.. యూపీలో కాంగ్రెస్కు సీనియర్ నాయకుడు. 2004లో షాజహాన్పూర్, 2009లో ధౌరాహ్రా నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2008 నుంచి 2009 వరకు అప్పటి యూపీఏ ప్రభుత్వంలో ఉక్కుశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. రెండోసారి యూపీఏ ప్రభుత్వంలోనూ పలు శాఖలకు సహాయమంత్రిగా వ్యవహరించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జితిన్ పార్టీని వీడటం కాంగ్రెస్కు గట్టి దెబ్బే అని చెప్పాలి. మధ్య యూపీ ప్రాంతంలోని బ్రాహ్మణ వర్గంలో జితిన్కు గట్టి పట్టుంది. దీంతో ఆయన రాక భాజపాకు కలిసొచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..