CPI-CPM: తెలంగాణ గడ్డపై భాజపాను అడుగు పెట్టనివ్వం: సీపీఐ, సీపీఎం
ప్రజా సమస్యలపై విడివిడిగా పోరాటం చేస్తున్న సీపీఐ, సీపీఎం తెలంగాణ వేదికగా ఏకమవుతున్నట్టు ప్రకటించాయి. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన సంయుక్త సమ్మేళనంలో ఇరు పార్టీల ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హైదరాబాద్: భాజపా నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి ఉమ్మడి పోరాటాలు చేస్తామని సీపీఎం, సీపీఐ ప్రకటించాయి. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన సంయుక్త సమ్మేళనంలో ఇరు పార్టీల ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో భారాసతో కలిసి సాగుతామని, తెలంగాణ గడ్డపై భాజపాను అడుగు పెట్టనివ్వమని కమ్యూనిస్టులు నినదించారు. ప్రజా సమస్యలపై విడివిడిగా పోరాటం చేస్తున్న సీపీఐ, సీపీఎం తెలంగాణ వేదికగా ఏకమవుతున్నట్టు ప్రకటించాయి. సీపీఐ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారాం ఏచూరి సహా ఇరుపార్టీల రాష్ట్ర కార్యదర్శులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. మొట్టమొదటి సారిగా సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు సంయుక్తంగా సమావేశం నిర్వహించడం విశేషం.
రెండు పార్టీలు కలిసి పనిచేయడానికి ముందుకు రావడం పట్ల సీతారాం ఏచూరి హర్షం వ్యక్తం చేశారు. మోదీ సర్కారు భాజపాయేతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఏచూరి ఆరోపించారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని లౌకిక వాదాన్ని కాపాడుకోవాలంటే మోదీ సర్కారును గద్దె దించాలన్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ.. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఒకే దేశం, ఒకే భాష, ఒకే పార్టీగా మారాలని మోదీ భావిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ సమాఖ్య వ్యవస్థలో కేంద్రం, రాష్ట్ర అధికారాలు వేర్వేరుగా ఉంటాయన్న డి.రాజా.. ఆ హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. తెలంగాణ సహా తమిళనాడు, కేరళలో గవర్నర్ను ఒక సాధనంగా కేంద్రం వాడుకుంటోందని ఆరోపించారు. గతేడాది విజయవాడలో ఉద్యమ పునరేకీకరణ జరగాలని ప్రతిపాదించగా ఇప్పటికి అది సాధ్యమవుతోందని హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించటమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. దేశం కోసం, కార్మికుల రక్షణ కోసం ఒక్కటై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్