Munugode Bypoll: చేతి అన్ని వేళ్లకూ ఉంగరాలు.. నవ్వులు పూయిస్తోన్న కేఏ పాల్‌ సమాధానం

మునుగోడు ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కేఏ పాల్ తన ప్రచారంలో చేసిన హంగామా అందరికీ తెలిసిందే.

Updated : 03 Nov 2022 12:23 IST

హైదరాబాద్‌: మునుగోడు ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కేఏ పాల్ తన ప్రచారంలో చేసిన హంగామా అందరికీ తెలిసిందే. తనదైన శైలిలో కామెంట్లు, హావభావాలతో వార్తల్లో నిలిచిన ఆయన.. పోలింగ్‌ రోజూ తన పంథా కొనసాగించారు. నియోజకవర్గం పరిధిలోని 100 పోలింగ్‌ కేంద్రాలను చుట్టి రావాలని పాల్‌ నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా హడావుడిగా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్తూ తిరిగి పరుగులు పెడుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న పాల్‌కు ఉంగరం గుర్తును ఈసీ కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆయన తన రెండు చేతుల అన్ని వేళ్లకూ ఉంగరాలు ధరించి పోలింగ్‌ కేంద్రాల్లో తిరిగారు. ఉంగరం గుర్తు కేటాయిస్తే చేతికి ఉంగరాలతో రావడం ఎన్నికల నిబంధన ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించగా.. పాల్‌ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తెరాస గుర్తు కారు అని.. ఆ పార్టీ నేతలు 30వేల కార్లలో తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని