Kalvakuntla Kavitha: భారాసతో భాజపా బ్రెయిన్ డ్యామేజ్: ఎమ్మెల్సీ కవిత
దేశంలో భారత్ రాష్ట్ర సమితి (భారాస)(BRS)తో కొత్త చరిత్ర సృష్టిస్తామని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల నుంచి తమ పార్టీలోకి చేరికలు ఉంటాయని చెప్పారు.
హైదరాబాద్: దేశంలో భారత్ రాష్ట్ర సమితి (భారాస)(BRS)తో కొత్త చరిత్ర సృష్టిస్తామని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల నుంచి తమ పార్టీలోకి చేరికలు ఉంటాయని చెప్పారు. మీడియాతో ఇష్టాగోష్టిలో ఆమె మాట్లాడారు. మహిళలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అవహేళన చేస్తున్నారని కవిత ఆరోపించారు. సరైన సమయంలో భాజపాకు బుద్ధి చెబుతామన్నారు. బతుకమ్మను కూడా బండి సంజయ్ అవమానించారన్నారు.
యాగాలు చేయడం కేసీఆర్కు కొత్త కాదు..
‘‘భారత్ రాష్ట్ర సమితి ప్రకటనతో భాజపా బ్రెయిన్ డ్యామేజ్ అయింది. ప్రధాని మోదీ.. మమతా బెనర్జీని, బండి సంజయ్ నన్ను అవహేళన చేశారు. పశ్చిమ్బెంగాల్ ఎన్నికల్లో భాజపాకు ప్రజలు బుద్ధి చెప్పారు. తెలంగాణలోనూ ఆ పార్టీకి బుద్ధి చెప్తారు. యాగాలు చేయడం సీఎం కేసీఆర్ (CM KCR)కు కొత్త కాదు. భారాసకు దైవశక్తి అవసరం కాబట్టే యాగాలు చేస్తున్నాం. రానున్న రోజుల్లో మా పార్టీలోకి చాలా రాష్ట్రాల నుంచి చేరికలు ఉంటాయి. జాతీయ స్థాయిలో భాజపాకు భారాస ప్రత్యామ్నాయం కాబోతోంది. భాజపా వ్యతిరేక కూటములను ఏకం చేస్తాం. ఇతర రాష్ట్రాల్లో అక్కడి పరిస్థితులను బట్టి వ్యూహాలను ఖరారు చేస్తాం.
అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా వెళ్లి ఓడిస్తా..
భాజపా రణనీతిలో దర్యాప్తు సంస్థలు భాగమని ప్రజలకు తెలుసు. ఆ విషయంలో భయపడేది లేదు. భారత్ జాగృతి ద్వారా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతాం. రాష్ట్రంలో తెలంగాణ జాగృతి యథావిధిగా కొనసాగుతుంది. ఏపీలో ఎన్నికలకు సమయం ఉన్నందున ఇంకా అక్కడ మా వ్యూహాలు ఆలోచించలేదు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తా. భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) ఎక్కడ పోటీ చేసినా అక్కడికి వెళ్లి ప్రచారం చేసి ఆయన్ను ఓడిస్తా’’ అని కవిత వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్