Kalvakuntla kavitha: మునుగోడు ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు: ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సీఎం కేసీఆర్ వెన్నంటే ప్రజలు ఉంటారనే విషయం మరోసారి రుజువైందని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెరాసపై విమర్శలు చేసే వారికి మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు అని చెప్పారు.
నిజామాబాద్: రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సీఎం కేసీఆర్ వెన్నంటే ప్రజలు ఉంటారనే విషయం మరోసారి రుజువైందని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెరాసపై విమర్శలు చేసే వారికి మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు అని చెప్పారు. కార్తిక సోమవారాన్ని పురస్కరించుకుని నిజామాబాద్లోని నీలకంఠేశ్వర ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
‘‘మునుగోడులో సీఎం కేసీఆర్ను ఆశీర్వదిస్తూ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఇన్ని రోజులూ అవాకులు, చవాకులు మాట్లాడిన అనేక మంది నోళ్లు మూతపడేలా చేశారు. నల్గొండ జిల్లాలో ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టాం. ఇకపై తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా ప్రజలు తప్పకుండా కేసీఆర్ పక్షాన ఉంటారనే విశ్వాసం నాకుంది’’ అని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.