Karnataka: మంత్రి ఆడియో లీక్ కలకలం.. సీఎం బొమ్మైకి కొత్త తలనొప్పి!
కర్ణాటక(Karnataka)లో నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉందంటూ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ఊహాగానాలు వినబడుతున్న వేళ సీఎం బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai)కి .....
బెంగళూరు: కర్ణాటక(Karnataka)లో నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉందంటూ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తోన్న వేళ సీఎం బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai)కి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. తాజాగా న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యల ఆడియో క్లిప్ వైరల్గా మారడం ముఖ్యమంత్రికి తలనొప్పి వ్యవహారంగా మారింది. ‘‘మేం ప్రభుత్వాన్ని నడపడం లేదు.. అలా మేనేజ్ చేస్తున్నామంతే..’’ అని మంత్రి అన్నట్టుగా ఆడియో క్లిప్లో ఉంది. ఈ వ్యాఖ్యల పట్ల కొందరు మంత్రుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మంత్రి మధుస్వామి చేసిన వ్యాఖ్యలు తన ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామంగా మారడంతో సీఎం బసవరాజ్ బొమ్మై దిద్దుబాటు చర్యలకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి వేరే సందర్భంలో అలా మాట్లాడారని.. మధుస్వామి మాటలతో కలత చెంది బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తపరిచిన మిగతా మంత్రులతో తాను మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానన్నారు. మధుస్వామితో తాను మాట్లాడతాననీ.. ఆయన మాట్లాడిన సందర్భమే వేరు గనక వాటిని తప్పుడు అర్థంలో తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం అంతా బాగానే ఉందని.. ఎలాంటి ఇబ్బందుల్లేవని విలేకర్లతో బొమ్మై వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు.. బసవరాజ్ బొమ్మై రాష్ట్రంపై పట్టు కోల్పోయారన్న విమర్శలకు తావిచ్చాయి. దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన భాజపా యువనేత దారుణ హత్యతో సీఎం ఇరకాటంలో పడ్డారు. హత్య, తదనంతర పరిణామాల నేపథ్యంలో భాజపా అధిష్ఠానం ఆయన పట్ల గుర్రుగా ఉన్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి. పార్టీ నేతలనే కాపాడుకోలేకపోతున్నారని.. దీనికి తోడు మరికొన్ని విషయాల్లోనూ ఆయన పట్ల భాజపా అధిష్ఠానం అసంతృప్తిగా ఉన్నట్టు సొంత పార్టీ వర్గాలే పేర్కొనడంతో సీఎం మార్పుపై గుసగుసలు వినబడిన సంగతి తెలిసిందే. అయితే, కొద్దిరోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆకస్మిక కర్ణాటక పర్యటనతో ఈ ఊహాగానాలు మరింతగా ఎక్కువయ్యాయి. అయితే, దీనిపై మాజీ సీఎం యడియూరప్ప స్పందిస్తూ సీఎం బొమ్మై పదవికి వచ్చిన ప్రమాదమేమీ లేదని క్లారిటీ ఇచ్చిన కొద్ది రోజులకే మంత్రి మధుస్వామి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడం గమనార్హం.
రాజీనామా చేయాల్సిందే..
న్యాయశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల సొంత పార్టీ మంత్రుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన రాజీనామా చేయాలని కొందరు మంత్రులు పట్టుబడుతున్నారు. న్యాయశాఖ మంత్రి ఆడియో క్లిప్ లీక్ వ్యవహారంపై మంత్రి ఎస్టీ సోమశేఖర్, ఉద్యానశాఖ మంత్రి ముణిరత్న తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తున్నామని మంత్రి మధుస్వామి భావిస్తే తక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఆయన కూడా భాగమేనని.. ప్రతి కేబినెట్ సమావేశంలో తీసుకొనే నిర్ణయాల్లోనూ ఆయనకు భాగస్వామ్యం ఉంటుందన్నారు. మంత్రి స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమంటూ మండిపడ్డారు.
ఆడియో క్లిప్లో మంత్రి ఏమన్నారు?
చెన్నపట్నానికి చెందిన భాస్కర్ అనే సామాజిక కార్యకర్తతో మంత్రి శనివారం ఫోన్లో సంభాషించారు. పలు రైతు సమస్యలకు సంబంధించి సహకార బ్యాంకుపై ఆయన చేసిన ఫిర్యాదులకు ప్రతిస్పందనగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘మేం ఇక్కడ ప్రభుత్వాన్ని నడపడం లేదు.. మేనేజింగ్ చేస్తున్నామంతే. వచ్చే ఏడెనిమిది నెలల వరకు నెట్టుకుపోవాలి’’ అన్నట్టుగా ఆడియో రికార్డింగ్లో ఉంది. అలాగే, రైతు సమస్యల పట్ల సహకార శాఖ మంత్రి ఎస్.టి.సోమశేఖర్ చర్యలు తీసుకోకపోవడంపై నిస్సహాయతను వ్యక్తంచేయడం కూడా ఈ ఆడియోలో వినబడింది. ‘‘నాకు ఈ సమస్యలన్నీ తెలుసు. మంత్రి సోమశేఖర్ దృష్టికి వీటిని తీసుకెళ్లాను. అయినా.. ఆయన చర్యలు తీసుకోవడంలేదు. ఏం చేయాలి’’ అని మధుస్వామి అన్నట్టుగా ఆడియో క్లిప్లో రికార్డయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
కాంగ్రెస్కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాల్లో భాజపా (BJP) విజయం సాధించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) అన్నారు. -
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. -
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ తెదేపా అభ్యర్థి బొండా ఉమాను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. -
వాల్తేరు క్లబ్లో వైకాపా డిష్యుం డిష్యుం!
వాల్తేరు క్లబ్ ప్రభుత్వ భూమి. ఈ రోజుకూ నేను అదే చెబుతున్నా. ఏ రోజైనా ఒక సామాజికవర్గం చేతిలో ఉండి ఉండొచ్చు. -
నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు
నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు (Lok sabha Elections) నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. -
చీకటి పాలనకు చిరునామా.. జగనన్న కాలనీలు!
ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తాం.. అంటూ జగనన్న కాలనీల విషయంలో సీఎం జగన్ మొదటి నుంచీ గొప్పలు చెబుతున్నారు. -
వ్యూహకర్తలదే పెత్తనం!.. ప్రచారంలో పార్టీలను శాసించేది వారే
భారత రాజకీయాల్లో వ్యూహకర్తల పెత్తనం పెరిగిపోయింది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించే రోజులు పోయాయి. ప్రచారం మొత్తాన్ని వ్యూహకర్తలే శాసించే రోజులు వచ్చాయి. -
సార్వత్రిక సవాల్..
సార్వత్రిక ఎన్నికల సమరానికి రాష్ట్రం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల అనంతరం మరో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేస్తోంది. -
జగనాసురుడి ఓటమి ఖాయం
‘రాముడిని తలచుకుంటే.. మంచి పాలన గుర్తొస్తుంది. మనకూ మంచి పాలకులు కావాలి, సుపరిపాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రావణాసురుడిని చంపిన రాముడే ఆదర్శంగా.. ఈ రాష్ట్రంలోని ప్రజలంతా కలిసి తమ ఓట్లతో జగనాసురుడిని ఓడించేందుకు సిద్ధమయ్యారు. -
దుష్ట పాలనను అంతం చేద్దాం
శ్రీరామనవమి పర్వదినాన జనసేన అభ్యర్థులకు బీఫాంలను అందించడం ఆనందంగా ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ తెలిపారు. -
ఎన్నెన్నో హామీలిచ్చి.. ఆనక అయిదేళ్లూ ముంచేసి!
అయిదేళ్లలో జగన్ జిల్లాకు వచ్చినప్పుడల్లా ఇచ్చిన హామీల మొత్తం విలువ రూ.474 కోట్లు.. ఏటా గోదావరి వరదలకు కోనసీమ లంకల్లోని పల్లెలన్నీ వణికిపోయినా, గ్రామాలను అనుసంధానించే కాజ్వేలు మునిగిపోయినా నిధులు విడుదల చేయలేదు. -
తెదేపాలోకి మాజీ ఎమ్మెల్యే షేక్ సుభానీ
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగు దేశం పార్టీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. గుంటూరు తూర్పు తెదేపా అభ్యర్థి మహమ్మద్ నసీర్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే షేక్ సుభానీ బుధవారం ఉండవల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరారు. -
న్యాయమూర్తులపై దూషణ కేసు నిందితుడితో ఉన్న... జగన్, విజయసాయిరెడ్డిలు నేరస్థులే!
‘న్యాయమూర్తులను దూషించిన కేసులో రెండో నిందితుడు మణి అన్నపురెడ్డితో సన్నిహితంగా ఉండటంతో పాటు అతడికి ఆశ్రయమిస్తున్న సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి నేరస్థులే’ అని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. -
సాక్షిలో పనిచేసిన వారు, జగన్ బంధుమిత్రులే సలహాదారులు
సాక్షి మీడియాలో పనిచేసిన వారు, సీఎం జగన్ బంధుమిత్రులు, తెదేపా ప్రభుత్వంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసిన ఐఏఎస్ అధికారుల్నే వైకాపా ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకుందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
గులకరాయి డ్రామాలో బీసీలను బలిపశువులు చేస్తున్న జగన్
గులకరాయి డ్రామాలో బీసీలను బలిపశువులను చేయడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. -
జగన్పై దాడి కేసులో.. బొండా ఉమాను ఇరికించేందుకు వైకాపా కుట్ర
సీఎం జగన్పై రాయి దాడి కేసులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావును ఇరికించేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై ఆగని వైకాపా ఒత్తిళ్లు
వాలంటీర్లందరూ రాజీనామా చేసి ఆ పత్రాలను పంచాయతీ కార్యదర్శికి అందించాలి. అధికారంలోకి రాగానే వారందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటాం. -
వైకాపాకు అనుకూలంగా విజయవాడ సీపీ దర్యాప్తు
సీఎం జగన్పై రాయితో దాడి చేసిన ఘటనలో విజయవాడ పోలీస్ కమిషనర్(సీపీ) కాంతిరాణా వైకాపాకు అనుకూలంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
‘ముస్లింలలో అభద్రతాభావం సృష్టిస్తున్న వైకాపా’
ముస్లింలలో అభద్రతాభావాన్ని పెంచి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని సీఎం జగన్ కుట్రలు పన్నుతున్నారని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ మండిపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై