Karnataka: కాకరేపిన ఖాకీల కాషాయం దుస్తులు!
దసరా పండగ పురస్కరించుకొని కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న కాపు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులంతా కాషాయం చొక్కాలు, తెలుపు పంచెతో సంప్రదాయంగా ముస్తాబై ఫొటోలు దిగారు. ప్రస్తుతం అవి సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా.. పోలీసులు కాషాయం రంగు చొక్కాలు ధరించి
బెంగళూరు: దసరా పండగ పురస్కరించుకొని కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న కాపు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులంతా కాషాయం చొక్కాలు, తెలుపు పంచెతో సంప్రదాయంగా ముస్తాబై ఫొటోలు దిగారు. ప్రస్తుతం అవి సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పోలీసులు కాషాయం రంగు చొక్కాలు ధరించి సంబరాలు చేసుకోవడాన్ని తప్పుపడుతూ రాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుస ట్వీట్లు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ప్రశ్నించారు. ‘‘పోలీసుల యూనిఫాం ఒక్కటే ఎందుకు మార్చారు? వారికి త్రిశూలం కూడా ఇచ్చి హింసకు పాల్పడమని చెప్పకపోయారు? ఒకవైపు పోలీసులే సామాన్య ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారు. ఓ ఎమ్మెల్యే నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి నిందితుల్ని విడిపించుకొని వెళ్లాడు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలున్నాయా? మీకు పాలన చేతకకపోతే రాజీనామా చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’’ అని ట్వీట్లో పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థను ఆర్ఎస్ఎస్లో విలీనం చేయాలని ప్రయత్నిస్తున్నారా అంటూ సీఎం బసవరాజ్ బొమ్మైను ప్రశ్నించారు.
సిద్ధరామయ్య ట్వీట్లపై సీఎం బొమ్మై ఘాటుగా సమాధానం ఇచ్చారు. ‘‘ఆర్ఎస్ఎస్ అనేది జాతినిర్మాణం కోసం పాటుపడుతున్న అతిపెద్ద సంస్థ. ప్రతి పౌరుడిని సమానంగా చూస్తుంది. మీలా (కాంగ్రెస్ను ఉద్దేశించి) ఓటు బ్యాంక్ లెక్కలు కట్టదు. మా ప్రభుత్వం, మా పార్టీ రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తోంది. మీలా అదనపు రాజ్యాంగ వ్యవస్థ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ (ఎన్ఏసీ)ను ఏర్పాటు చేయలేదు’’ అని సీఎం అన్నారు. ఉడిపి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే రఘుపతి భట్ కూడా సిద్ధరామయ్యపై మండిపడ్డారు. ‘‘కాషాయాన్ని చూస్తే అంత భయమెందుకు? కాషాయం అంటే త్యాగానికి ప్రతీక. ప్రాచీన కాలం నుంచి కాషాయాన్ని భక్తితో చూస్తున్నాం. పోలీసులు కాషాయం రంగు దుస్తుల్ని వేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న సిద్ధరామయ్యకు.. తాను టిప్పు సుల్తాన్ టోపీ ధరించి ఖడ్గాన్ని చేతపట్టినప్పుడు ఐక్యత గుర్తురాలేదా? పోలీసులు కాషాయం ధరిస్తే అందులో ఇబ్బందేముంది?’’అని ప్రశ్నించారు. పోలీసుల తీరు.. నేతల వ్యాఖ్యలతో ఈ వ్యవహారం కర్ణాటకలో హాట్ టాపిక్గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
ఇటీవల తన తల్లి మృతి నేపథ్యంలో హమీర్పుర్ సీటు తనకు ఇచ్చినా పోటీ చేసే ఉద్దేశం లేదని డిప్యూటీ సీఎం కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి అన్నారు. -
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా నడుస్తోందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. -
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
మహారాష్ట్రలోని బారామతిలో ఉత్కంఠ పోరు నెలకొంది. పవార్ కుటుంబంలోని ఇద్దరు మహిళలు పరస్పరం తలపడటం ఉత్కంఠ రేపుతోంది. -
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్డీఏ కూటమి నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. -
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
తెలుగుదేశం అభ్యర్థులకు అధినేత చంద్రబాబు ఈనెల 21న బీఫామ్లు అందజేయనున్నారు. -
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా నారా లోకేశ్ నామినేషన్ దాఖలు చేశారు. -
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
రాష్ట్రానికి ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
భీమిలి, జీడీ నెల్లూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైకాపా నేతలు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. -
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. -
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
వైఎస్ఆర్ హయంలో హంద్రీనీవా ప్రాజెక్టు 90 శాతం పూర్తి అయిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అధికారంలోకి వస్తే ప్రాజెక్టు పూర్తి చేసి -
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
మాజీ మంత్రి వివేకానందరెడ్డి 40 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేశారని ఆయన కుమార్తె సునీత అన్నారు. వివేకాను అత్యంత దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. -
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీకి చెందిన గూండాలు అరాచకం సృష్టించారు. -
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
కాంగ్రెస్కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాల్లో భాజపా (BJP) విజయం సాధించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) అన్నారు. -
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. -
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ తెదేపా అభ్యర్థి బొండా ఉమాను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. -
వాల్తేరు క్లబ్లో వైకాపా డిష్యుం డిష్యుం!
వాల్తేరు క్లబ్ ప్రభుత్వ భూమి. ఈ రోజుకూ నేను అదే చెబుతున్నా. ఏ రోజైనా ఒక సామాజికవర్గం చేతిలో ఉండి ఉండొచ్చు. -
నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు
నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు (Lok sabha Elections) నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల