Kasani Gnaneshwar: తెదేపా తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌

తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ నియమితులయ్యారు. ఈనెల 10న అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.

Updated : 04 Nov 2022 17:14 IST

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ నియమితులయ్యారు. ఈమేరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బక్కని నర్సింహులుకు పొలిట్‌ బ్యూరోలో స్థానం కల్పించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నర్సింహులు నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కాసాని జ్ఞానేశ్వర్‌ ఈనెల 10న అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని