Kavitha Kalvakuntla: అక్కడ మా ఎమ్మెల్యే లేకపోయినా అభివృద్ధి ఆగలేదు: ఎమ్మెల్సీ కవిత

మునుగోడులో ఉపఎన్నిక ఎప్పుడు జరిగినా తెరాసనే విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

Updated : 10 Aug 2022 19:10 IST

హైదరాబాద్‌: మునుగోడులో ఉపఎన్నిక ఎప్పుడు జరిగినా తెరాసనే విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెరాసకు ఉమ్మడి నల్గొండ జిల్లా కంచుకోట అని.. హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో హేమాహేమీలను ఓడించామని ఆమె గుర్తుచేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌ దోమలగూడలోని భారత స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మోడల్‌ హైస్కూల్‌లో నిర్వహించిన వేడుకల్లో కవిత పాల్గొ్న్నారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు.

మునుగోడులో తమ పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా అభివృద్ధి ఆగలేదని చెప్పారు. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు. ఇటు పార్టీని.. అటు ప్రభుత్వాన్ని నడపడంలో సీఎం కేసీఆర్‌ ముందుంటారని చెప్పారు. బిహార్‌ రాజకీయాలను యావత్‌దేశం గమనిస్తోందని.. అక్కడ ఏకపక్ష నిర్ణయాలు, తెరవెనుక రాజకీయాలు భాజపాకు మంచిది కాదన్నారు. ఇలాంటి వాటికి మునుగోడు ఉప ఎన్నిక సమాధానం చెబుతుందని కవిత చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని