Kavitha Kalvakuntla: అక్కడ మా ఎమ్మెల్యే లేకపోయినా అభివృద్ధి ఆగలేదు: ఎమ్మెల్సీ కవిత
మునుగోడులో ఉపఎన్నిక ఎప్పుడు జరిగినా తెరాసనే విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
హైదరాబాద్: మునుగోడులో ఉపఎన్నిక ఎప్పుడు జరిగినా తెరాసనే విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెరాసకు ఉమ్మడి నల్గొండ జిల్లా కంచుకోట అని.. హుజూర్నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో హేమాహేమీలను ఓడించామని ఆమె గుర్తుచేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ దోమలగూడలోని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ హైస్కూల్లో నిర్వహించిన వేడుకల్లో కవిత పాల్గొ్న్నారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు.
మునుగోడులో తమ పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా అభివృద్ధి ఆగలేదని చెప్పారు. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు. ఇటు పార్టీని.. అటు ప్రభుత్వాన్ని నడపడంలో సీఎం కేసీఆర్ ముందుంటారని చెప్పారు. బిహార్ రాజకీయాలను యావత్దేశం గమనిస్తోందని.. అక్కడ ఏకపక్ష నిర్ణయాలు, తెరవెనుక రాజకీయాలు భాజపాకు మంచిది కాదన్నారు. ఇలాంటి వాటికి మునుగోడు ఉప ఎన్నిక సమాధానం చెబుతుందని కవిత చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం