Kejriwal: ‘ఆప్ని గెలిపిస్తే..’ గుజరాత్ ప్రజలకు కేజ్రీవాల్ హామీలు
పంజాబ్ ఎన్నికల్లో భారీ విజయంతో మంచి ఉత్సాహంతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి గుజరాత్పై దృష్టి పెట్టింది. ....
భుజ్: పంజాబ్ ఎన్నికల్లో భారీ విజయంతో మంచి ఉత్సాహంతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి గుజరాత్పై దృష్టి పెట్టింది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా ఏంటో నిరూపించుకొనేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలి కాలంలోనే నాలుగు సార్లు పర్యటించారు. తాజాగా గుజరాత్లోని కచ్ జిల్లా భుజ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆప్ను అధికారంలోకి తీసుకొస్తే దిల్లీ తరహాలో నాణ్యమైన పాలనను అందిస్తామని గుజరాత్ ఓటర్లకు హామీ ఇచ్చారు. విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత, నాణ్యమైన విద్యనందిస్తామన్నారు. మంచి విద్యాప్రమాణాలతో పేదరికాన్ని నిర్మూలించొచ్చని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పాఠశాలల్లో మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచడంతో పాటు కొత్త పాఠశాలలను సైతం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, తాము అధికారంలోకి వస్తే గుజరాత్లోని ప్రైవేటు పాఠశాలల్లో ఆడిట్ నిర్వహిస్తామని.. దిల్లీలో చేసినట్టుగానే తల్లిదండ్రుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బుల్ని తిరిగి ఇప్పిస్తామన్నారు. కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించి వారికి ఉద్యోగ భద్రత కల్పించనున్నట్టు కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?