KishanReddy: ఈ ప్రాంతమే నాకు జీవం పోసింది.. కిషన్రెడ్డి భావోద్వేగ ప్రసంగం
అంబర్పేటకు వస్తే చాలా రోజుల తర్వాత బిడ్డ తల్లిదగ్గరకు వచ్చినట్లుఉందని ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన చేపట్టిన జన ఆశీర్వాద్ సభ శనివారం ఒకప్పుడు.....
హైదరాబాద్: అంబర్పేటకు వస్తే చాలా రోజుల తర్వాత బిడ్డ తల్లి దగ్గరకు వచ్చినట్లు ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన చేపట్టిన జన ఆశీర్వాద్ సభ శనివారం గతంలో తన సొంత నియోజకవర్గమైన అంబర్పేటలో జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగించిన కిషన్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘దిల్లీలో ఉన్నానంటే కారణం అంబర్పేట ప్రజలు, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలే. కేంద్రమంత్రి అయినందుకు నాకు సంతోషం లేదు.. అంబర్పేటకు దూరమయ్యానన్న బాధ ఉంది. అంబర్పేట బిడ్డగా అందరూ గర్వపడేలా పనిచేస్తా. అంబర్పేట నాకు తల్లిలాంటిది. ఈ ప్రాంతమే నాకు జీవం పోసింది. పార్టీ.. అంబర్పేట నాకు రెండు కళ్లతో సమానం’’ అని వ్యాఖ్యానించారు.
‘‘దేశంలో కరోనా నుంచి కాపాడేందుకు 57కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ అందించాం. 130 కోట్ల మందికి రెండు డోసులూ చివరి వ్యక్తి వరకు ఉచితంగా టీకా అందిస్తాం. ప్రజల ప్రాణాల్ని కాపాడతాం. పేద ప్రజలు కొవిడ్తో ఇబ్బంది పడకూడదని గతేడాది ఏప్రిల్ నుంచి దేశంలోని 80కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇస్తున్నాం. వచ్చే దీపావళి వరకు ఇస్తాం.. ఇంకా అవసరమైతే దాన్ని మరింత కాలం పొడిగిస్తాం’’ అని పేర్కొన్నారు.
మాస్క్లు పెట్టుకోండి.. ఎవరికీ ఏం కాదు
‘‘అందరూ మాస్క్ పెట్టుకోండి. ఏడాదిన్నర నుంచి నేను ఇంట్లో తప్ప మాస్క్ తీయలేదు. గాంధీ ఆస్పత్రుల్లో వెంటిలేటర్ల వార్డుకు తొమ్మిదిసార్లు వెళ్లాను. మాస్క్ పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకున్నా గనకే కరోనా నన్నేమీ చేయలేదు. నేను కరోనాని జయించాను. రాష్ట్రంలో ఎన్నో ఆస్పత్రులు తిరిగా.. రోగులను కలిశా.. మందులు తీసుకొచ్చా.. ఆక్సిజన్ తెచ్చా.. ఆక్సిజన్ ప్లాంట్ తీసుకొచ్చా. సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రజలకు ప్రభుత్వాసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నాం. మాస్క్లు పెట్టుకోండి. ఎవరికేం కాదు. మాస్క్లు పెట్టుకోవడంతో పాటు జాగ్రత్తగా ఉండండి’’ అని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
‘‘వరంగల్లోని రామప్ప దేవాలయానికి ప్రపంచ గుర్తింపు తేవాలని గతంలో పనిచేస్తే దురదృష్టవశాత్తు కాలేదు. కేంద్ర పర్యాటకమంత్రి అయ్యాక ప్రధాని మోదీతో మాట్లాడాను. ఏ దేశాలైతే ప్రపంచ గుర్తింపు ఇవ్వడానికి నిరాకరించాయో.. ఆ దేశాలను ఒప్పించేలా చేయగలిగాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో మీ అంబర్పేట బిడ్డ కూడా కీలక పాత్ర పోషించారు. గోల్కొండ కోటను కూడా అభివృద్ధి చేస్తా. అంబర్పేట ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా’’ అన్నారు.
గల్లీగల్లీ తిరగాలని మనసులోఉంది.. కానీ!
గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంబర్పేటలో గల్లీ గల్లీ తిరిగినట్టు ఇప్పుడూ తిరగాలని నాకు మనసులో ఉంది. కానీ సమయం సహకరించడం లేదు. బాధ్యత పెద్దది. దిల్లీలో ఉండాలి.అందరినీ కలవాలి. అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షించాలి.నన్ను భవిష్యత్తులోనూ మీరంతా ఆశీర్వదించాని కోరుకుంటున్నా..’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వసుంధర రాజెను పట్టించుకోని భాజపా
రాజస్థాన్కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి తిరుగులేని నేతగా ఒక వెలుగు వెలిగిన వసుంధర రాజె ఊసే ఈ ఎన్నికల్లో కనిపించడం లేదు. ఆమెను భాజపా పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. -
సిట్టింగులు పోయి.. కొత్తోళ్లు
భాజపా 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 303 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆ సిట్టింగ్ సీట్లలో ఈసారి ఇప్పటివరకు 130 చోట్ల వేర్వేరు కారణాల వల్ల అభ్యర్థులను మార్చింది. -
ప్రపంచాన యుద్ధమేఘాలు.. బలమైన భాజపా సర్కార్ అవసరం
ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధమేఘాలు ఆవరించాయని, ఈ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలు కాపాడాలంటే కేంద్రంలో బలమైన, స్థిరమైన భాజపా ప్రభుత్వం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. -
సమయానికి ‘108’ రాకే రాజాంలో బాలుడి మృతి
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
జగన్పై రాయి దాడి కేసులో సెక్షన్ 307 వర్తించదు
సీఎం జగన్పై హత్యాయత్నమే జరగనప్పుడు నిందితుల మీద 307 సెక్షన్ ఎలా బనాయిస్తారని తెదేపా నేతలు ప్రశ్నించారు. చిన్న రాయితో హత్యాయత్నానికి ప్రయత్నించాడని ఓ అమాయకుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా అరెస్టు చేశారని ఆరోపించారు. -
షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసు
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆమె వివేకా హత్యను ప్రస్తావించి వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు అవినాష్రెడ్డి, మల్లాది విష్ణు, వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. -
రాయి దాడి హత్యాయత్నం కాదు.. జగన్ నాటకం: వర్ల రామయ్య
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి హత్యాయత్నం కాదని..ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయడం లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలి
జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఉద్దేశించి ఈ నెల 16న భీమవరం సభలో సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనాకు ఆ పార్టీ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. -
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగు సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించి ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు. -
అభ్యర్థుల ఆస్తులు.. అప్పులు.. కేసులు..
లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డిపై కేసు
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డిపై ఆదిభట్ల పోలీస్స్టేషన్లో భూకబ్జా కేసు నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు