Kishan Reddy: కేసీఆర్లో అభద్రతా భావం కనబడుతోంది: కిషన్రెడ్డి కౌంటర్
తెలంగాణ ముఖ్యమంత్రి నిన్న బడ్జెట్పై నిర్వహించిన ప్రెస్మీట్లో భాజపాపైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు
దిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న బడ్జెట్పై నిర్వహించిన ప్రెస్మీట్లో భాజపాపైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. బుధవారం ఆయన దిల్లీలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దేశ ప్రధాని గురించి మాట్లాడుతున్నప్పుడు హుందాగా ఉండాలి. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా భాజపా పైనా, కేంద్ర ప్రభుత్వం పైనా దిగజారి భాషను ఉపయోగిస్తూ అడ్డగోలుగా, అనైతికంగా మాట్లాడుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల మరుసటి రోజు నుంచి ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు, తెరాస మంత్రులు ఒక వ్యూహం ప్రకారం కుట్రపూరితంగా భాజపాపై విషం చిమ్మే కార్యాచరణ ప్రణాళికతో పనిచేస్తున్నారు. రోజూ వరుసల వారీగా కేసీఆర్ కుటుంబ సభ్యులు, వంతుల వారీగా మంత్రులు; అవసరమైనప్పుడు సీఎం కేసీఆర్.. తప్పుడు ప్రచారం, విష ప్రచారం, వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ ఆ రాజ్యాంగాన్నే మార్చాలని మాట్లాడటం; ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిని అవమానించేలా మాట్లాడటం రాజకీయ విలువలకు, నైతిక విలువలకు, మానవీయ విలువలకు జుగుప్సను కలిగించేలా ఉన్నాయి’’ అన్నారు.
సీఎం అయ్యాకైనా భాష మారాలి కదా!
‘‘ఏ రాజ్యాంగం ఆధారంగా తెలంగాణలో పార్టీ పెట్టి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో ఆ రాజ్యాంగాన్ని, దాన్ని రూపకల్పన చేసిన అంబేడ్కర్ను అవమానించేలా అవహేళనగా సీఎం కేసీఆర్ మాట్లాడటం దురదృష్టకరం. కేసీఆర్ చేసిన ప్రకటన పట్ల సమాజంలో ఉన్న రాజకీయ విశ్లేషకులు, మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులంతా సిద్ధాంతాలు, రాజకీయాలకతీతంగా ఖండించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దిగజారే భాషను ఉపయోగించారు.. కానీ సీఎం అయ్యాక మార్పు రావాలి. రాజ్యాంగ బద్ధమైన పదువుల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడే విధానంలో, అభిప్రాయాలు తెలిపే విధానంలో కొంత సంయమనం ఉండాల్సిన అవసరం ఉంది. తమిళనాడు వంటి రాష్ట్రాలకు వెళ్లేటప్పుడు అక్కడి ప్రజల సంప్రదాయాల్ని గౌరవించేలా ప్రధాని దుస్తులుధరిస్తే దాన్ని విమర్శించడం సీఎం స్థాయివ్యక్తికి తగదు. తొలినుంచి కూడా సీఎం కేసీఆర్ చెప్పేదొకటి.. చేసేదిమరొకటి’’ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల సంగతేంటి?
‘‘నలుగురిని ఆకట్టుకొనే విధంగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవు. రెండున్నర గంటల పాటు ఏకపాత్రాభినయం చేస్తూ ప్రయోగించిన భాష యావత్ సమాజానికి సంబంధించిన అభిప్రాయం అన్నట్లుగా సీఎం మాట్లాడారు. ఈటల విజయం తర్వాత సీఎంలో, సీఎం కుటుంబంలో అభద్రతా భావం స్పష్టంగా కనబడుతోంది. తనకు నచ్చనిది ఈ సమాజంలో ఎవరికీ నచ్చరాదనే భావనతో వ్యవహరిస్తున్నారు. భాజపాను, కేంద్రాన్ని మీరు విమర్శించే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంత వరకు పూర్తి చేశారో చెప్పండి. నిన్నటి బడ్జెట్పై అనేక రకాలుగా ప్రజల్ని తప్పుదారి పట్టించేలా కేసీఆర్ ప్రయత్నం చేశారు. యూరియాపై సబ్సిడీ తగ్గించినట్టు ప్రచారం చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది యూరియాపై 33శాతం సబ్సిడీ మొత్తాన్ని పెంచాం. బడ్జెట్ అంచనాలు వేరేగా ఉంటాయి. సవరించిన అంచనాలు మారుతాయనేది గుర్తుంచుకోవాలి’’ అంటూ కేసీఆర్పై కిషన్రెడ్డి విరుచుకుపడ్డారు.
రేపు రాష్ట్రవ్యాప్తంగా దీక్షలకు భాజపా పిలుపు
మరోవైపు, సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా భాజపా రేపు దీక్షలకు పిలుపునిచ్చింది. రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టనుంది. భాజపా భీం దీక్ష పేరుతో గురువారం భాజపా శ్రేణులు దీక్షలకు సిద్ధమవుతున్నాయి. ఉదయం 10గంట నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మండల కేంద్రాల్లో దీక్ష చేపట్టనున్నారు. అలాగే, భాజపా రాష్ట్ర కార్యాలయంలో భాజపా నేతలు లక్ష్మణ్, రాజాసింగ్ ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు దీక్షలో కూర్చోనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని తెదేపా నేత బొండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
సమయానికి ‘108’ రాకే రాజాంలో బాలుడి మృతి
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
జగన్పై రాయి దాడి కేసులో సెక్షన్ 307 వర్తించదు
సీఎం జగన్పై హత్యాయత్నమే జరగనప్పుడు నిందితుల మీద 307 సెక్షన్ ఎలా బనాయిస్తారని తెదేపా నేతలు ప్రశ్నించారు. చిన్న రాయితో హత్యాయత్నానికి ప్రయత్నించాడని ఓ అమాయకుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా అరెస్టు చేశారని ఆరోపించారు. -
షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసు
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆమె వివేకా హత్యను ప్రస్తావించి వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు అవినాష్రెడ్డి, మల్లాది విష్ణు, వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. -
రాయి దాడి హత్యాయత్నం కాదు.. జగన్ నాటకం: వర్ల రామయ్య
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి హత్యాయత్నం కాదని..ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయడం లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలి
జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఉద్దేశించి ఈ నెల 16న భీమవరం సభలో సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనాకు ఆ పార్టీ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. -
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు. -
అభ్యర్థుల ఆస్తులు.. అప్పులు.. కేసులు..
లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డిపై కేసు
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డిపై ఆదిభట్ల పోలీస్స్టేషన్లో భూకబ్జా కేసు నమోదైంది. -
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు: జగ్గారెడ్డి
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు, గ్రాఫిక్ లీడర్స్ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. -
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
‘ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తెదేపా అధిష్ఠానం ఆదేశించింది. ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తా. -
అభ్యర్థుల ఆస్తుల వివరాలివీ..
రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా, రెండో రోజు శుక్రవారం వివిధ పార్టీల తరఫున పలువురు అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత